Supreme Court: తర్వాత రాజధాని రైలునూ షెడ్యూల్ చేయమంటారా? వందే భారత్ పిటిషన్పై సుప్రీం అసహనం
వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలు సర్వీసుపై దాఖలపై ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. రైలు ఏ స్టేషన్లో ఆగాలనేది మేం నిర్ణయించాలా? అన్ని పిటిషనర్ను ప్రశ్నించింది.
దిల్లీ: కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat train) రైలు స్టాప్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కొట్టివేసింది. ఇలాంటి అభ్యర్థనతో అత్యున్నత న్యాయస్థానానికి రావడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇవన్నీ ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలని పిటిషనర్కు కాస్త గట్టిగానే చెప్పింది.
కేరళ (Kerala)లోని మలప్పురం జిల్లాలో గల తిరూర్ రైల్వే స్టేషన్ (Tirur railway station)లో వందే భారత్ రైలుకు హాల్ట్ ఇచ్చేలా దక్షిణ రైల్వేకు ఆదేశాలివ్వాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన న్యాయవాది పీటీ శీజిష్ తొలుత కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తొలుత తిరూర్లో వందే భారత్ను ఆపాలని నిర్ణయించినప్పటికీ.. ఆ తర్వాత రాజకీయ కారణాలతో రైల్వే శాఖ ఆ నిర్ణయాన్ని మార్చుకుందని ఆరోపించారు. అయితే, ఈ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో సుప్రీంకోర్టు (Supreme Court)కు వెళ్లారు. ఈ పిటిషన్ను సోమవారం పరిశీలించిన సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేసింది.
వందే భారత్ ఎక్స్ప్రెస్లో మంటలు
‘‘వందేభారత్ రైలు ఏ స్టేషన్లో ఆగాలనేది నిర్ణయించాలని మీరు మమ్మల్ని కోరుతున్నారు. ఆ తర్వాత దిల్లీ-ముంబయి రాజధాని (Rajdhani Train) స్టాప్ ఎక్కడుండాలో కూడా మమ్మల్ని షెడ్యూల్ చేయమంటారా? ఇలాంటివి మేం ప్రభుత్వానికి చెప్పలేం. ఇది విధానపరమైన అంశం. అధికారుల దగ్గరకు వెళ్లండి’’ అని పిటిషన్ను కొట్టివేస్తూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘‘రైళ్లు ఎక్కడెక్కడ ఆగాలనేది రైల్వే శాఖ నిర్ణయిస్తుంది. ఫలానా రైలు ఫలానా స్టేషన్ దగ్గర ఆగాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా వందే భారత్ (Vande Bharat train) లాంటి హైస్పీడ్ రైళ్ల స్టాప్లను ఇలాంటి డిమాండ్ల ప్రాతిపదికన నిర్ణయించడం సరికాదు. ప్రతి జిల్లాలో నుంచి ఓ వ్యక్తి తమకు నచ్చిన రైల్వే స్టేషన్లో స్టాప్ ఉండాలని డిమాండ్ చేయడం ప్రారంభిస్తే.. హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుకు ప్రయోజనం లేకుండా పోతుంది. ఎక్స్ప్రెస్ రైలు అనే పదానికి అర్థం లేకుండా పోతుంది’’ అని కోర్టు తెలిపింది. కనీసం తన పిటిషన్ను పరిశీలించేలా ప్రభుత్వానికి సూచించాలని పిటిషనర్ అభ్యర్థించగా.. ధర్మాసనం అందుకు తిరస్కరించింది. తాము ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
India-China: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. -
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. -
ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ చూపించారు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను ఆయన సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. -
ఆయనకు 84.. ఆమెకు 66
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే (84)కు ఆయన కుమారులు, కుమార్తెలు 66 ఏళ్ల వృద్ధురాలితో ఘనంగా రెండోపెళ్లి జరిపించారు. -
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. -
4 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుష్షు
నాలుగు నిమిషాల్లోనే ఒక మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు.. వారి సాధారణ ఆయుష్షు కన్నా ఐదేళ్లు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. -
వారణాసి గంగా హారతిలో అమిత్ షా, యోగి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. -
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. -
ఓ ఆదివాసీ ప్రశ్నకు వ్యంగ్యంగా బదులిచ్చానంతే
రత్లాం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. -
నింగిలో రంగురంగుల అరోరాలు
చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!