Balakrishna: ‘అఖండ’ అప్‌డేట్‌ ఇస్తారా?

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రైతు పాత్రతో పాటు అఘోరగాను కనిపించనున్నారు. ఇటీవల ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన  ‘అఖండ’ టైటిల్‌ రోర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

Updated : 07 May 2021 13:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రైతు పాత్రతో పాటు అఘోరాగానూ కనిపించనున్నారు. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన  ‘అఖండ’ టైటిల్‌ రోర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. 50 మిలియన్‌ వ్యూస్‌ని దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. తొలుత ఈ సినిమాని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా రెండో దశ కారణంగా విడుదల తేదీని వాయిదా వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

ఎన్‌బీకే - బోయపాటి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తోన్న ‘అఖండ’లో ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌, పూర్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన #బీబీ3 ఫస్ట్ రోర్‌తో పాటు ఇటీవల విడుదలైన టీజర్‌ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’అంటూ బాలకృష్ణ  చెప్పిన డైలాగ్‌కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని