Jawan: ఆయనతో మాట్లాడి ‘జవాన్’ను ఆస్కార్కు పంపుతా: అట్లీ
తాజా బ్లాక్ బస్టర్ ‘జవాన్’ విషయంలో తన మనసులో మాటను దర్శకుడు అట్లీ (Atlee) బయటపెట్టారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ముంబయి: షారుక్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా అట్లీ తెరకెక్కించిన చిత్రం ‘జవాన్’ (Jawan). ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమా హావా కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో ఇప్పటికీ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అట్లీ ఈ సినిమాను ఆస్కార్కు పంపే ఆలోచనలో ఉన్నట్లు తన మనసులో మాటను బయటపెట్టారు.
‘ఓ సినిమా వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుంది. అలా కష్టపడి పనిచేసిన ప్రతి దర్శకుడు, టెక్నిషియన్స్, నటీనటులు.. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరూ దానికి అవార్డులు రావాలనే కోరుకుంటారు. ‘గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్, నేషనల్ అవార్డు.. ఇలా ఏ పురస్కారం వచ్చిన అంతా సంతోషిస్తారు. నాకు ‘జవాన్’ను ఆస్కార్కు తీసుకెళ్లాలనే కోరిక ఉంది. ఈ విషయంపై షారుక్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. ఈ ఇంటర్వ్యూ షారుక్ చూస్తుంటారని ఆశిస్తున్నా. ‘సర్, మనం ఈ చిత్రాన్ని ఆస్కార్కు తీసుకెళ్దామా?’ అని ఆయన్ని అడుగుతాను’’ అంటూ నవ్వుతూనే ఆస్కార్కు వెళ్లాలనే తన కోరికను బయటపెట్టారు అట్లీ (Atlee). ప్రస్తుతం సోషల్ మీడియాలో అట్లీ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
దర్శకులు విలన్లుగా కనిపిస్తే.. ‘నా సామిరంగ’!
ఇక ‘జవాన్’లో ద్విపాత్రాభినయంతో షారుక్ అదరగొట్టారు. ఆయన లుక్స్, యాక్షన్ విజువల్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కథానాయికగా నయనతార, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి, ఇతర కీలక పాత్రల్లో ప్రియమణి, సాన్యా మల్హోత్ర తదితరులు ఆకట్టుకున్నారు. రూ.300కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.858 కోట్లు వసూళ్లు చేసి రూ.1000 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇటీవలే ఈ సినిమా విజయోత్సవాలను ముంబయిలో ఘనంగా జరిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. -
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు. -
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే అంటూ ‘సర్కార్’లో ఓటు ప్రాధాన్యం గురించి విజయ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. -
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
trinayani serial actress died: బుల్లితెర నటి పవిత్రా జయరాం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు -
ఒక్క రోజేంటి?.. ఈ జీవితమే అమ్మది: చిరంజీవి
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్లు పెట్టారు. -
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!