Jr NTR: ఎన్టీఆర్తో ‘మిషన్ ఇంపాజిబుల్’లాంటి మూవీ.. అలా‘శక్తి’గా మారిపోయింది!

ఇంటర్నెట్డెస్క్: ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘శక్తి’ (sakthi movie). ఇలియానా కథానాయిక. భారీ బడ్జెట్తో అశ్వినీదత్ నిర్మించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. అసలు మెహర్ రమేశ్ చెప్పిన కథ వేరే ఉందట. ‘కంత్రీ’ తర్వాత నిర్మాత అశ్వినీదత్ను కలిసిన మెహర్ రమేశ్ ఓ సోషల్ ఫిల్మ్ను తీయాలనుకున్నారు. ఎన్టీఆర్కు కూడా అదే కథను వినిపించారు. ఇద్దరికీ బాగా నచ్చేసిందట. ఇండస్ట్రీలో స్నేహితులైన దర్శకుడు వి.వి.వినాయక్, కథానాయకుడు అల్లు అర్జున్లకు కూడా ఈ కథ వినిపించి అభిప్రాయం తీసుకున్నారట మెహర్ రమేశ్. అందరికీ కథ నచ్చింది. అదే సమయంలో ఎన్టీఆర్ తన డేట్స్ను ముందుగా ‘బృందావనం’ కోసం కేటాయించాల్సి వచ్చింది. దీంతో మెహర్ రమేశ్ మూవీ ఆలస్యమైంది.
ఈ క్రమంలోనే నిర్మాత అశ్వినీదత్కు ఒక ఆలోచన వచ్చిందట. ఎన్టీఆర్తో ‘పాతాళ భైరవి’, ‘జగదేక వీరుడు’లాంటి సోషియో ఫాంటసీ మూవీ తీయాలనుకున్నారట. అందుకోసం ఇండస్ట్రీలో అప్పటికే ఉన్న సీనియర్ రచయితలను పిలిపించి, తాను అనుకున్న ఆలోచనలను చెప్పడంతో సోషల్ ఫిల్మ్గా తీయాలనుకున్న ‘శక్తి’ సోషియో ఫాంటసీ మూవీగా అయింది. సుమారు రూ.25కోట్లతో సినిమా తీద్దామని చిత్రీకరణ మొదలు పెడితే, అది అలా అలా పెరిగిపోయి భారీ బడ్జెట్ చిత్రంగా మారిపోయింది. ఆధ్యాత్మిక కథలపై తనకు పెద్దగా అవగాహన లేకపోయినా, తన వంతు ప్రయత్నించి, సినిమాను తీసినట్లు మెహర్ రమేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ ఎన్టీఆర్తో ‘మిషన్ ఇంపాజిబుల్’లాంటి మూవీ చేసి ఉంటే, ఎలా ఉండేదో..!
‘బేబీ’కి యువత ఫిదా.. సోషల్మీడియాలో ఫన్నీ మీమ్స్ వరద..!
ఇక ఇదే ‘శక్తి’ మూవీపై గతంలో అశ్వినీదత్ కూడా స్పందించారు. ‘‘నా కెరీర్లో బాగా నిరాశకు గురి చేసిన సినిమా ‘శక్తి’. ‘ఇక మనకి ఈ ఇండస్ట్రీ అనవసరం. సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం’ అనిపించింది. నిర్మాణ వ్యయం బాగా ఎక్కువైపోయింది. ఆ ఒక్క సినిమాతోనే రూ.32 కోట్లు పోయాయి. ఇది మామూలు విషయం కాదు. ‘శక్తి’ మాత్రం నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అందుకే నాలుగైదేళ్ల పాటు సినిమాలు తీయాలని అనిపించలేదు. ఈలోగా పిల్లలు వచ్చి సినిమా తీస్తామంటే ఒప్పుకొన్నా. మంచి సినిమాలు తీయడంతో వాళ్లను ప్రోత్సహిస్తూ వచ్చా’’ అని అశ్వినీదత్ అన్నారు.
ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్పై ప్రభాస్ కథానాయకుడిగా ‘ప్రాజెక్ట్-కె’ రూపొందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకుడు. దీపిక పదుకొణె, కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు దర్శకుడు మెహర్ రమేశ్ ‘భోళా శంకర్’ తీస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా ఇది రూపొందుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వేదాళం’కు రీమేక్గా దీన్ని తీర్చిదిద్దారు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

ఆ సినిమా వెంకటేష్కైతే బాగుండేదన్న చిరంజీవి
అగ్ర కథానాయకుల్లో చిరంజీవికి ఉన్న ఇమేజ్ వేరు. ఆయన యాక్షన్ను మాస్ ఇష్టపడితే, ఆయన డ్యాన్స్, కామెడీ టైమింగ్కు ఫ్యామిలీ ప్రేక్షకులు ఫిదా అవుతారు. అయితే, ‘డాడీ’ ఒప్పుకోవడం వెనుక ఆసక్తికర విషయాన్ని చిరు ఓ సందర్భంలో షేర్ చేసుకున్నారు. -

‘ఛత్రపతి’లో ఇంటర్వెల్ సీన్.. అసలు నిజం చెప్పిన ప్రభాస్!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ గురించి ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -

ఆ ఒక్క సీన్ తేడా జరిగితే నన్ను చంపేసేవాళ్లు..: మురారి క్లైమాక్స్ గురించి కృష్ణవంశీ
మహేశ్బాబు (Mahesh Babu) కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మురారి (Murari). -

‘నువ్వు నాకు నచ్చావ్’.. మూడు గంటలు ఎవరు చూస్తారు అన్నారంతా..!
ప్రేక్షకుల మదిలో కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నిసార్లు చూసినా అస్సలు విసుగు అనిపించవు సరికదా.. చూసిన ప్రతిసారి ఓ సరికొత్త అనుభూతిని పంచుతూనే ఉంటాయి. -

ఆ సీన్చేసి ఉంటే మా నాన్నకు గుండె పోటు వచ్చేది.. అందుకే చేయలేదు
గ్వినత్ పాల్ట్రో (Gwyneth Paltrow).. హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్. 1998లో వచ్చిన ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’లో ఆమె నటన అందర్నీ ఆకర్షించింది. -

క్లైమాక్స్లో ఇంగ్లీష్ పాట వద్దే వద్దు.. ఉండాల్సిందేనన్న పవన్కల్యాణ్
పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘తమ్ముడు’ మూవీలో ‘ట్రావెలింగ్ సోల్జర్’ పాటను వద్దని అనుకున్నారు. -

చొక్కా లేకుండా రజనీకాంత్ ఫైట్.. స్టంట్ మాస్టర్కు డైమండ్స్ ఆఫర్!
‘నరసింహ’ సినిమాలోని ఓ ఫైట్ సీన్ గురించి స్టంట్ మాస్టర్ కనల్ ఆసక్తికర విషయం చెప్పారు. -

అలీ విమానం మిస్సయితే.. రాజేష్ కాస్తా.. ‘సత్యం’ రాజేష్ అయ్యాడు!
విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రాజేష్ అవకాశాల కోసం రెండు, మూడేళ్ల పాటు స్టూడియోల చుట్టూ తిరిగిన రాజేష్ కెరీర్ను ‘సత్యం’ మలుపు తిప్పింది. -

వెంకటేశ్ హిట్ మూవీ.. మిస్ అయిన ఐదుగురు హీరోయిన్లు!
వెంకటేశ్ కెరీర్లో హిట్గా నిలిచిన ఓ సినిమాకి ముందు వేరే హీరోయిన్లను అనుకున్నా చివరకు ప్రీతి జింటా ఎంపికయ్యారు. ఆ ఆసక్తికర విశేషాలివీ.. -

రూ.60వేల అప్పు.. ఇబ్బందులు పడిన పద్మనాభం
నటుడిగానే కాదు, నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు పద్మనాభం (Padmanabham). రూ.60వేల అప్పు చేసి చివరి వరకూ ఇబ్బందులు పడ్డారు. ఫిబ్రవరి 20న పద్మనాభం వర్థంతి సందర్భంగా ఆయన కెరీర్లో చోటు చేసుకున్న సంఘటన.. -

‘అంజి’ ఇంటర్వెల్కు నెలరోజులు.. మూవీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Chiranjeevi: చిరంజీవి కథానాయకుడిగా దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ మూవీ ‘అంజి’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇవే! -

‘ఉరికే చిలకా’.. రెహమాన్ ఫస్ట్ ఛాయిస్ ఎస్పీబీ లేదా యేసుదాసు..
అరవింద స్వామి, మనీషా కొయిరాలా కీలక పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బొంబాయి’. వివాదాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. -

మహేశ్- రాజమౌళి కాంబో.. 16 ఏళ్ల క్రితమే ఫిక్స్.. ఎవరీ నిర్మాత?
మహేశ్బాబు- రాజమౌళి కాంబినేషన్లో మూవీ 16 ఏళ్లకే క్రితమే ఖరారైన సంగతి మీకు తెలుసా? అసలు ఈ చిత్ర నిర్మాత ఎవరంటే? -

కట్ చేస్తే.. 23 ఏళ్లు.. ప్రియాంకా చోప్రా టాలీవుడ్ ఎంట్రీ ఇలా
‘ఎస్ఎస్ఎంబీ 29’లో ప్రియాంకా చోప్రా నటించిన సంగతి తెలిసిందే. అంతకన్నా ముందే ఆమె తెలుగులో నటించిన సంగతి తెలుసా? -

అసలు ‘శివ’లో కథ ఉందా: తనికెళ్ల భరణి కామెంట్.. ఆ కారణంతో ప్రాజెక్ట్ నుంచి ఔట్!
తెలుగు సినీ చరిత్రలో ‘శివ’ ఒక కల్ట్ క్లాసిక్. ఓ ట్రెండ్ సెట్టర్. రాంగోపాల్వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో నాగార్జున (Nagarjuna) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం అత్యాధునిక హంగులతో, 4కె విజువల్స్తో నవంబరు 14న ఈ మూవీ మరోసారి ప్రేక్షకులకు ముందుకు రానుంది. -

సమయం కోరిన ప్రభాస్.. నో చెప్పిన డైరెక్టర్.. అలా మొదలైంది ‘ఈశ్వర్’
ప్రభాస్ నటించిన తొలి సినిమా ‘ఈశ్వర్’. విడుదలై 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు.. -

కేవలం ఆ రెండు సీన్లకు డబ్బింగ్ చెప్పి.. రజనీ మెప్పు పొంది..
మనో.. రజనీ నటించిన ఏ చిత్రానికి డబ్బింగ్ చెప్పారో తెలుసా? ‘ముత్తు’. ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం వెనుక ఉన్న కథను మనో ఓ సందర్భంలో పంచుకున్నారు. -

‘నీకేమైనా పిచ్చా.. మొత్తం పాట బైక్ మీద తీస్తే బోర్.. ‘గులాబీ’ మూవీకి 30ఏళ్లు
‘గులాబీ’ (Gulabi) 90వ దశకంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీస్లో ఇదీ ఒకటి. అప్పట్లో యువ ప్రేమికులను ఓ ఊపు ఊపేసిన సినిమా. ఈ సినిమా విడుదలై నవంబరు 3వ తేదీకి 30ఏళ్లు పూర్తి చేసుకుంది. -

‘శివ’లో ఆ పాత్ర కోసం మోహన్బాబు.. వద్దంటే వద్దన్న వర్మ!
నాగార్జున కథానాయకుడిగా వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ ఓ పాత్ర కోసం మోహన్బాబును అనుకున్నారట. -

‘కింగ్’లో బ్రహ్మానందం కామెడీ.. ‘హిందోళంలో ‘రి’ ఉండదు’ ఈ సీన్ అలా చేశారు!
నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘కింగ్’ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య పాత్రలో బ్రహ్మానందం వినోదాన్ని పంచిన సంగతి తెలిసిందే. ఇందులో మ్యూజిక్ కాంపిటీషన్స్లో ఆయన నవ్వుల పాలయ్యే సీన్ వెనక ఆసక్తికర విషయాన్ని దర్శకుడు శ్రీనువైట్ల ఓ సందర్భంలో పంచుకున్నారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (12/01/2026)
-

టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు.. డబుల్ డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/01/2026)
-

ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీఎల్లో ఆ మూడు మ్యాచ్లు!
-

‘రఫ్ఫాడించేద్దాం’.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనిల్ రావిపూడి.. నాటి వీడియో వైరల్
-

కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్


