Tollywood: ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి. కొన్నాళ్లుగా వాళ్లూ యాక్షన్ కథలపై మక్కువ ప్రదర్శిస్తూ వస్తున్నారు. దాంతో ప్రేమకథలకి విరామం వచ్చినట్టైంది. అలాగని బొత్తిగా ప్రేమ ఊసులు లేకపోలేదు. అప్పుడప్పుడూ ప్రేమలోని మాధుర్యాన్ని గుర్తు చేస్తూ అలరిస్తుంటాయి మన సినిమాలు. 2022లో ‘సీతారామం’, 2023లో ‘బేబి’ చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్లీ మన చిత్రసీమ ప్రేమలో పడుతున్నట్టు కనిపిస్తోంది.
ప్రేమకథలు తెలుగు తెరకు కొత్త కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ వస్తూనే ఉన్నాయి. అప్పుడూ ఇప్పుడూ ప్రేమ అదే. కానీ ప్రేక్షకుడిని సరికొత్తగా అలరిస్తూ వస్తోంది. ప్రేమలో ఉన్న గొప్పదనమే అది. అందుకే దర్శకులు వీలు కుదిరినప్పుడల్లా ప్రేమకథలతో స్క్రిప్టులు సిద్ధం చేస్తుంటారు. ప్రేమ చుట్టూ తిరిగే సినిమాలు భవిష్యత్తులో చాలానే రాబోతున్నాయి. ప్రభాస్ మొదలుకొని ఆనంద్ దేవరకొండ వరకూ పలువురు కథానాయకులు ప్రేమకథలతో మురిపించనున్నారు.
చారిత్రక కథలో...?
ప్రేమకథలపై తనదైన ముద్ర వేశారు హను రాఘవపూడి. ఆయన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’ మొదలుకొని ‘సీతారామం’ వరకూ ఆయన సినిమాల్లో ప్రేమని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. ఈసారి ప్రభాస్ని ఆయన ఓ చారిత్రక ప్రేమకథలో చూపించనున్నట్టు సమాచారం. అందుకు సంబంధించి స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. యు.వి.క్రియేషన్స్ నిర్మించనున్న ఆ సినిమా ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కనుందని సమాచారం. నాగచైతన్య - చందూ మొండేటి కలయికలో రూపొందుతున్న ‘తండేల్’ కూడా ప్రేమకథతోనే రూపొందుతోంది. భారత్ - పాక్ మధ్య సాగే కథ ఇది. ప్రేమ, సముద్రం నేపథ్యం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య ఉత్తరాంధ్రకి చెందిన మత్స్యకారుడిగా కనిపించనున్నారు.
తెలుసు కదా...
ప్రముఖ నిర్మాణ సంస్థలు అగ్ర హీరోలతో ఒకపక్క యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు చేస్తూనే... మరోవైపు వినూత్నమైన ప్రేమకథల్ని తెరకెక్కించడంపైనా దృష్టిపెట్టాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రేమ, హాస్యం మేళవింపుతో అశోక్ గల్లా కథానాయకుడిగా ఓ చిత్రం చేస్తోంది. ఉద్భవ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి కెప్టెన్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోనని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘తెలుసు కదా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ఇది కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందుతున్నట్టు సమాచారం. మరికొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి ప్రేమకథల్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘‘పాన్ ఇండియా ట్రెండ్ వల్ల చాలా మంది కథానాయకులు యాక్షన్ కథలపైనే మొగ్గు చూపుతున్నారు. దాంతో ప్రేమకథల జోరు తగ్గింది. భవిష్యత్తులో మళ్లీ ప్రేమకథల ట్రెండ్ మొదలవుతుంద’’ని పలువురు దర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
‘బేబి’ కలయికలో...
‘బేబి’ సినిమాతో తెలుగు పరిశ్రమకి దొరికిన నయా ప్రేమికుడు ఆనంద్ దేవరకొండ. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయిరాజేశ్ రాసిన కథతోనే... ఆనంద్, వైష్ణవి జంటగా మరో కొత్త ప్రేమకథ తెరకెక్కుతోంది. రవి నంబూరి దర్శకుడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం సెట్స్పై ఉంది. భవిష్యత్తులో మా నుంచి మరికొన్ని ప్రేమకథలు వస్తాయని దర్శకుడు సాయిరాజేశ్ చెప్పారు. దిల్రాజు ప్రొడక్షన్స్ నుంచి ‘లవ్ మీ’ అంటూ మరో కొత్త రకమైన ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రమిది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. దెయ్యంతో ముడిపడిన ప్రేమకథ ఇది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!