Priyadarsi: థ్రిల్ ప్రాప్తిరస్తు
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. జాన్వీ నారంగ్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ‘థ్రిల్-యు ప్రాప్తిరస్తు’’ అనే ఉపశీర్షికతో సినిమా ఎలా ఉండనుందన్నది తెలియజేసేలా ఓ ప్రచార చిత్రాన్ని పంచుకున్నారు. ‘‘సరికొత్త కాన్సెప్ట్తో కూడిన రొమాంటిక్ స్టోరీతో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ప్రియదర్శి చాలా హిలేరియస్ పాత్రలో కనిపించనున్నారు. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరిలో సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం’’ అని చిత్రవర్గాలు తెలిపాయి.
ప్రేమ.. యాక్షన్.. సందేశం
సంజయ్రావ్, ఆయేషాఖాన్ జంటగా మణీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. లివింగ్స్టన్ నిర్మాత. గౌర హరి సంగీతమందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను హీరో సాయిదుర్గా తేజ్ ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. హీరో మాట్లాడుతూ.. ఇది తన జీవితాన్ని మలుపుతిప్పే చిత్రం అవుతుంది అన్నారు. ‘‘టికెట్ కొనుక్కొని థియేటర్కు వచ్చే ప్రేక్షకులకు డబ్బుకు మించిన ఆనందాన్నిస్తుంది’’ అన్నారు మణీంద్రన్. ప్రేమ, యాక్షన్తో పాటు మంచి సందేశమున్న చిత్రమిదన్నారు నిర్మాత. కార్యక్రమంలో బ్రహ్మాజీ, గౌర హరి తదితరులు పాల్గొన్నారు.
రాజు యాదవ్ రాగాలాపన
గెటప్ శ్రీను హీరోగా కె.కృష్ణమాచారి తెరకెక్కించిన చిత్రం ‘రాజు యాదవ్’. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘‘దిస్ ఈజ్ మై దరిద్రం’’ అనే గీతాన్ని నటుడు సుడిగాలి సుధీర్ విడుదల చేశారు. ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు. రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ సంయుక్తంగా ఆలపించారు. ‘‘ప్రేమ, వినోదంతో పాటు మదిని హత్తుకునే బలమైన భావోద్వేగాలతో నిండి ఉన్న చిత్రమిది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. కూర్పు: బొంతల నాగేశ్వర రెడ్డి, ఛాయాగ్రహణం: సాయిరామ్ ఉదయ్.
మోహన కృష్ణన్ కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు మెజతూర్ మోహనకృష్ణన్ (74) ఆదివారం కన్నుమూశారు. మలయాళ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన పలు టీవీ సీరియళ్లలోనూ కనిపించారు. మాలీవుడ్లో గొప్ప దర్శకులుగా పేరున్న లోహితదాస్, జయరాజ్ల దర్శకత్వంలో చాలా చిత్రాల్లో ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. ‘తిలకం’, ‘పైత్రుకం’, ‘దేశదానమ్’, ‘కారుణ్యమ్’ తదితర చిత్రాల్లో శిఖరస్థాయి నటన ప్రదర్శించారు. ఆయన మృతి పట్ల కేరళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మోహనకృష్ణన్కి భార్య శోభన, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్ రీక్యాప్’ థియేటర్లు దద్దరిల్లాయిలా..!
మే 15వ తేదీన ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించిన టీజర్ను విడుదల చేయనున్న నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు
-
Jabardasth Promo: భూమిపైకి వచ్చిన దేవకన్యలు.. రాఘవకు వచ్చాయి తిప్పలు!
ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్ (Jabardasth)’. మే 16న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
Dhee Promo: లవర్ బాయ్గా రెచ్చిపోతానంటున్న ఆది.. ‘ఢీ’లో నవ్వులే నవ్వులు
అదిరిపోయే డ్యాన్స్లతో ప్రతి బుధవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘ఢీ - సెలబ్రిటీ స్పెషల్’. మే 15న ప్రసారం కానున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.
-
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
ఆయన సలహాను పట్టించుకోని సావిత్రి
ప్రముఖ నటి సావిత్రి (Savitri) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే? -
ఓటెత్తిన సినీ లోకం
పౌర విధిని నిర్వర్తించడంలో మేం ముందుంటామని మరోసారి చాటి చెప్పింది సినీలోకం. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. -
ముగిసిన త్రిష ఐడెంటిటీ
గతేడాది ‘లియో’తో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. -
నేనెంటో చెప్పేది నా పనే..!
అందం, అభినయంతో పాటు ‘మెట్గలా’లాంటి ఫ్యాషన్ వేదికలపై మెరుస్తూ.. అంతర్జాతీయంగా తన పరపతి పెంచుకుంటోంది అగ్ర నాయిక అలియా భట్. త్వరలో ‘జిగ్రా’తో అభిమానుల ముందుకొస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలివి. -
రజనీ పూర్తి చేశారు
కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్. ఒకవైపు ఒప్పుకున్న సినిమాల్ని పూర్తి చేస్తూ... మరోవైపు కొత్త చిత్రాల్ని పట్టాలెక్కిస్తూ మెరుపు వేగం ప్రదర్శిస్తున్నారు. -
కేన్స్ చిత్రోత్సవాల్లో కన్నప్ప టీజర్
‘కన్నప్ప’తో థియేటర్లలో సందడి చేయనున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మాత. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాక్సిక్లోకి మరో అందం?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత కథానాయకుడు యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నయనతార ఓ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. -
అక్షయ్ సరసన అవకాశం ఎవరికి?
ఈ ఏడాది అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. వరుస సినిమాలను పట్టాలెక్కించిన ఈయన దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించనున్న హారర్ కామెడీ చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. -
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ తన వైవాహిక బంధానికి వీడ్కోలు పలికాడు. తన భార్య సైంధవితో వీడిపోతున్నట్లు ప్రకటించాడు. -
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు
-
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
-
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
వైట్హౌస్లో ‘సారే జహాసె అచ్ఛా..’ ‘పానీపూరీ’ల విందు
-
పాక్ ప్రభుత్వ కంపెనీలన్నీంటిని ప్రైవేటీకరిస్తాం: ప్రధాని షెహబాజ్