manchu manoj: అభిమానుల కోసం సినీతారలు ఆడే ఆట ఉస్తాద్
కథానాయకుడిగా వెండితెరపై వినోదం పంచిన మంచు మనోజ్ ఇప్పుడు ‘ఉస్తాద్’ షోతో వ్యాఖ్యాతగా అభిమానుల ముందుకు రానున్నారు.
కథానాయకుడిగా వెండితెరపై వినోదం పంచిన మంచు మనోజ్ ఇప్పుడు ‘ఉస్తాద్’ షోతో వ్యాఖ్యాతగా అభిమానుల ముందుకు రానున్నారు. ర్యాంప్ ఆడిద్దాం...అనేది ఉపశీర్షిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ గేమ్ షోను రూపొందిస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ నెల 15నుంచి ప్రసారం కానున్న ఈ షో ప్రోమోను బుధవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ‘‘నేను మీ మనోజ్. నా కథ మీరు రాసుకున్నది. నా రాక మీరు పిలుస్తున్నది. ప్రతి హీరోను నడిపించే సైన్యం ఫ్యాన్స్. ప్రతి స్టార్ సంపాదించుకునే ధైర్యం ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్కి నేనివ్వబోతున్న రిటర్న్ గిప్ట్’ అంటూ ప్రోమోలో మనోజ్ చెప్పిన సంభాషణలు ఈ షోపై ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ...‘ఏడేళ్ల తర్వాత ఏడు అడుగులేసి ఇండస్ట్రీలోకి వస్తున్నాను. ఆ గ్యాప్లో భిన్నమైన జీవితాన్ని చూశాను. ఇప్పటి వరకు నా అభిమానులు నాకందించిన ప్రేమను ఒక బాధ్యతగా భావించి తిరిగి ఈ షోతో వారి ముందుకు వస్తున్నాను. ఈటీవీ నుంచి రామోజీరావు, బాపినీడు, సాయికృష్ణ, నితిన్, సాయికిరణ్తో పాటు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఎంతో సపోర్ట్ చేశారు. ఈ షో కంటెంట్తో మొదటిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఏంటీ అని అడిగాను. ప్రతి హీరోను ఆదరించే అభిమానుల కోసం చేసే షో అని చెప్పడంతో ఒప్పుకున్నాను. సినీతారలను అభిమానించే అభిమానుల కోసం ఒక సెలబ్రిటి ఆడే ఆట ఇది. ఫ్యాన్స్ కోసం ఆట ఆడి వాళ్లకు డబ్బు ఇవ్వడం అనేది గొప్ప కాన్సెప్ట్. అదే ఈ షో ప్రత్యేకత. రూ.50లక్షలు, ప్రత్యేక బహుమతులుంటాయి. మంచి వినోదాన్ని అందిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. మళ్లీ పుట్టి మీ ముందుకొచ్చాను’ అని అన్నారు. ‘ఈటీవీతో మా సంస్థ కలిసి పనిచేయడం గర్వకారణం. ఈ షో కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో మనోజ్ మేము ఊహించిన దానికంటే ఎక్కువ కంటెంట్ అందించారు’’ అని అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘ఎన్నో ఏళ్ల దిగ్విజయ ప్రయాణం ఈటీవీది. అందులోని మరో మెట్టే ఈటీవీ విన్. ఈటీవీ నిర్మిస్తున్న మొట్టమొదటి నాన్ ఫిక్షన్ షో ‘ఉస్తాద్’. మా అందరికీ ఈ షో ఎంతో ప్రత్యేకం’ అన్నారు ఈటీవీ విన్ క్రియేటివ్ హెడ్ నితిన్ చక్రవర్తి. దర్శకుడు వంశీ మాట్లాడుతూ...‘మనోజ్ నాకు మంచి స్నేహితుడు. తను అభిమానుల నుంచి విరామం తీసుకోలేదు. వారికి ఇంకా దగ్గర కావాలని ఈ షోని ఎంపిక చేసుకున్నాడు. తను ఏది చేసిన మనసు పెట్టి చేస్తాడు. ఈ షో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాన’ని అన్నారు.ఈ కార్యక్రమంలో భూమా మౌనిక రెడ్డి, ఈటీవీ విన్ బిజినెస్హెడ్ సాయికృష్ణ, బీవీఎస్ రవి, టీజీ విశ్వ ప్రసాద్, రఘనందన్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం