Lalitha: నటి కేపీఏసీ లలిత కన్నుమూత
సీనియర్ మలయాళీ నటి కేపీఏసీ లలిత (73) కన్ను మూశారు. ఐదు దశబ్దాలపాటు తల్లి, సోదరి, కోడలు, కుమార్తె ఇలా పలు సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఆమె మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నాటకాలతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె ‘కుట్టుకుడుంబం’ చిత్రం ద్వారా వెండితెరపైకి
సీనియర్ మలయాళీ నటి కేపీఏసీ లలిత (73) కన్ను మూశారు. ఐదు దశబ్దాలపాటు తల్లి, సోదరి, కోడలు, కుమార్తె ఇలా పలు సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఆమె మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నాటకాలతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె ‘కుట్టుకుడుంబం’ చిత్రం ద్వారా వెండితెరపైకి అడుగుపెట్టారు. లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. నాటకాలపై ఆసక్తితో కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్ (కేపీఏసీ)లో చేరి నటిగా కెరీర్ మొదలుపెట్టి కేపీఏసీ లలితగా గుర్తింపు పొందారు. 550పైగా చిత్రాల్లో నటించారు. అలాగే అమరం (1991), శాంతమ్ (2000) చిత్రాల్లోని నటనకు గానూ రెండుసార్లు ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారామె. అంతేకాకుండా కేరళ సంగీత అకాడెమీ ఛైర్మన్గా పనిచేశారు. పలు ధారావాహికల్లోనూ లలిత నటించారు. 1978లో ప్రముఖ దర్శకుడు భరతన్తో ఆమె వివాహం జరిగింది. 1998లో ఆయన చనిపోయారు. ఆ దంపతులకు కుమార్తె శ్రీకుట్టి, కుమారుడు సిద్ధార్థ్ భరత్ను ఉన్నారు. సిద్ధార్థ్ నటుడు, దర్శకుడిగా మలయాళంలో గుర్తింపు పొందారు. లలిత మృతిపట్ల ప్రముఖ మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్లాల్, సురేష్ గోపీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిందీ బాక్సాఫీస్ ఆశలన్నీ...దక్షిణాది సినిమాలపైనే!
‘పఠాన్’, ‘జవాన్’, ‘గదర్ 2’, ‘యానిమల్’... తదితర చిత్రాలతో గతేడాది ఫామ్లోకి వచ్చినట్టు కనిపించింది బాలీవుడ్. కానీ ఈ ఏడాదిలో మళ్లీ ఎదురు గాలి మొదలైంది. -
ముచ్చటగా మూడోసారి
ప్రస్తుతం ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ రష్మిక హవా కనిపిస్తోంది. వరుసగా అగ్రతారల సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ జోరు చూపిస్తోంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో మిస్టర్ బచ్చన్ మీటింగ్
తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతోంది. -
నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం
చిత్రపరిశ్రమలో మంచి నటీనటులుగా ఎదగడానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కారణం ఉంటుంది. తన జీవితంలో కూడా ‘రాబ్తా’ కీలక పాత్ర పోషించిందని అంటోంది బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ -
వెతుకు.. సత్యభామ.. వెతుకు!
కాజల్ పోలీసు పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల తెరకెక్కించిన ఈ సినిమాని బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా నిర్మించారు -
మురుగడి మాయేరా.. సిత్తరం ఉంటే సెప్తాదా
‘హరోం హర’ చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు సుధీర్బాబు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు -
లేదే.. లేదే.. లోకంలోనే ప్రేమే లేదసలే
‘రాజు యాదవ్’గా సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. -
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
వికృత నేరాల రూపం.. కొడగు బాలిక కేసు కొత్తమలుపు
-
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/24)
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ