Preity Zinta: మేకప్‌ తీసేసి రమ్మంటే.. మణిరత్నం జోక్‌ చేస్తున్నారనుకున్నా: ప్రీతీ జింటా ఆసక్తికర వ్యాఖ్యలు

తన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘దిల్ సే’ రోజులను ప్రీతీ జింటా గుర్తు చేసుకున్నారు.

Updated : 09 Feb 2024 11:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దిల్‌ సే’తో వెండితెరకు పరిచయమయ్యారు నటి ప్రీతీ జింటా. ఆ చిత్రంలో షారుక్‌తో కలిసి ఆమె సందడి చేశారు. తాజాగా ఆ సినిమా సంగతులను ఇన్‌స్టాలో గుర్తు చేసుకుంటూ ఫొటోను షేర్‌ చేశారు.

‘ఆ సినిమాలో అవకాశం రాగానే షూటింగ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూశా. మణిరత్నం, షారుక్‌లతో (Shah Rukh Khan) పనిచేస్తున్నందుకు ఆనందించా. సెట్‌లోకి అడుగుపెట్టగానే మణి సర్‌ నన్ను చూసి ముఖం కడుక్కొని రమ్మని నవ్వుతూ చెప్పారు. జోక్‌ చేస్తున్నారనుకున్నా. మేకప్‌ పోతుందని చెప్పా. ‘నాకు కావాల్సింది అదే. దయచేసి ముఖం కడుక్కొని రండి’ అన్నారు. దీంతో మేకప్‌ తీసేశాను. ఆ తర్వాత తీసిన క్లోజప్‌ షాట్‌ అద్భుతంగా వచ్చింది. ఈ ఫొటో తొలి సన్నివేశంలోనిది. మా ఫొటోగ్రఫీ డైరెక్టర్‌కు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.

రివ్యూ: అయలాన్‌.. గ్రహాంతరవాసితో శివకార్తికేయన్‌ చేసిన హంగామా మెప్పించిందా?

తొలి సినిమా ‘దిల్‌సే’ తోనే ప్రీతి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.‘ప్రేమంటే ఇదేరా’తో తెలుగువారికీ పరిచయమయ్యారు. అనంతరం వరుస బాలీవుడ్‌ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. 2016లో అమెరికాకు చెందిన జీన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని