Bollywood: హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు.
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ జోడీలకు పరిశ్రమలో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అలా పేరు సంపాదించుకున్న జంటలు మరోసారి తెరపై కలిసి సందడి చేయడానికి ముస్తాబవుతున్నాయి. ఆ విశేషాలేంటి? మరి మళ్లీ ఆ మ్యాజిక్ పునరావృతమవుతుందా?
రణ్బీర్, అలియాల ప్రేమకహానీ
తెరపై ప్రేమికులుగా కనిపించడమే కాదు.. నిజ జీవితంలోకి ఆ ప్రేమను ఆహ్వానించి ఒక్కటైన జంట రణ్బీర్ కపూర్, అలియా భట్లు. ‘బ్రహ్మాస్త్ర’లో జోడీగా కనిపించి ‘‘కుంకుమలా నువ్వే చేరగా ప్రియా..’’ అంటూ ప్రేమపాటలు పాడుకుంటూ సినీ ప్రేమికుల మనసుల్ని గెలుచుకుని బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. మళ్లీ ఎప్పుడెప్పుడు ఈ జోడీని తెరపై చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇటీవలే ఓ తీపికబురు వినిపించారు. వీరిద్దరు కలిసి ‘లవ్ అండ్ వార్’ పేరుతో ఓ విభిన్నమైన ప్రేమకథా చిత్రంలో నటించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ తెరకెక్కించనున్నారు. ఇందులో విక్కీ కౌశల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్కి ఈ సినిమా విడుదల కానుంది.
ఎనిమిదేళ్ల తర్వాత
కంగనా రనౌత్, ఆర్ మాధవన్ కలయికలో రూపొందిన ‘తనూ వెడ్స్ మను’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ ఒక్కటి కానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్న ఓ చిత్రంలో వీరిద్దరు జంటగా నటిస్తున్నారు. విజయ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఈ జంట సందడి ఎలా ఉండనుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజుల ఆగాల్సిందే అంటున్నాయి సినీవర్గాలు.
కుమారి కోసం సంస్కారి..
‘‘ప్రతి ప్రేమకథకు.. ఆ ప్రేమలో జరిగే యుద్ధం ఉంటుంది’’ అంటూ ‘బవాల్’ చిత్రంతో ఓ గొప్ప ప్రేమకథను తెరపై ఆవిష్కరించారు వరుణ్ ధావన్, జాన్వీ కపూర్లు. ఇప్పుడు ఈ హిట్ జోడీ మరో భిన్నమైన ప్రేమకథతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. వరుణ్, జాన్వీ జంటగా ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంస్కారి తన కుమారి ప్రేమ కోసం ఎలాంటి త్యాగాలు చేశాడో చూపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రానుంది.
‘బాఘీ’ హీరోతో దిశ..
బాలీవుడ్లో హిట్ కాంబినేషన్గా గుర్తింపు తెచ్చుకున్న మరో జంట టైగర్ష్రాఫ్, దిశా పటానీ. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘బాఘీ 2’ మంచి విజయాన్ని అందుకుంది. మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో ఇద్దరూ తమ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ జోడీ ‘హీరో నంబర్ 1’తో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. టైగర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని జగన్ శక్తి తెరకెక్కిస్తున్నారు. ‘‘ఇందులో ముందు సారా అలీఖాన్ని అనుకున్నాం. కొన్ని కారణాలతో తను తప్పుకోవడంతో ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్లో తనదైన ముద్ర వేయడానికి దిశా సిద్ధంగా ఉంది’’ అని ఇటీవలే చిత్రబృందం తెలిపింది. వాషు భగ్నానీ, జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!