macherla niyojakavargam: ఏప్రిల్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’

నితిన్‌ కథానాయకుడిగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు శుక్రవారం ప్రకటించారు.

Updated : 13 Nov 2021 07:34 IST

నితిన్‌ కథానాయకుడిగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘‘రాజకీయ అంశాలతో మిళితమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నితిన్‌ ఓ సరికొత్త అవతారంలో కనిపిస్తారు. దీంట్లోని ప్రేమకథ చాలా కొత్తగా ఉంటుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని