Manchu Lakshmi: పవన్‌-విష్ణు మాట్లాడుకున్నారు.. అంతా కలిసే ఉన్నాం: మంచు లక్ష్మి

హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం సందడిగా జరిగిన విషయం తెలసిందే. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు...

Published : 18 Oct 2021 16:01 IST

హైదరాబాద్‌: హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం సందడిగా జరిగిన విషయం తెలసిందే. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు హాజయ్యారు. అయితే, ‘అలయ్‌ బలయ్‌’ వేదికపై పవన్‌కల్యాణ్‌తో మాట్లాడేందుకు విష్ణు ప్రయత్నించారని.. అయితే పవన్ ఏమాత్రం స్పందించలేదంటూ పలు వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.  ఈ విషయంపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. ‘‘ఒక్క ఫొటోనో, లేదా వీడియోనో చూసి మీరు అలా ఎలా అనుకుంటారు? పవన్‌-విష్ణు ఎన్నో విషయాలపై చర్చించుకున్నారు. మేమంతా కలిసే ఉన్నాం’’ అని మంచు లక్ష్మి వివరించారు.

మరోవైపు ‘మా’ ఎన్నికలు హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌కు మద్దతుగా నిలిచిన నాగబాబుకి, మంచు విష్ణుకి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘మా’ ఎన్నికల నుంచి చిరంజీవి నన్ను తప్పుకోమన్నారు’’ అని ఆరోపించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని