RJ పాలిటిక్స్: అంత్యాక్షరి, ఇటాలియన్ వంటలతో కాలక్షేపం!
కాంగ్రెస్ రెబల్ నేతలతో కలిసి రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రపన్నారని తనపై వచ్చిన ఆరోపణలను కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఖండించారు. ఈ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో జైపూర్లోని ఓ లగ్జరీ హోటల్ వేదికగా జరుగుతున్న కార్యకలాపాలపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ సెటైర్లు
జైపూర్: కాంగ్రెస్ రెబల్ నేతలతో కలిసి రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రపన్నారని తనపై వచ్చిన ఆరోపణలను కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఖండించారు. ఈ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో జైపూర్లోని ఓ లగ్జరీ హోటల్ వేదికగా జరుగుతున్న కార్యకలాపాలపై విరుచుకుపడ్డారు. ‘మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ.. దానిపై పోరాడాల్సిన సమయంలో మీరు అంత్యాక్షరి ఆడుతున్నారు. పేదలకు ఆహారం అందివ్వాల్సిన సమయంలో మీరు మాత్రం ఇటాలియన్ వంటకాలను తయారుచేయడం నేర్చుకుంటున్నారు. రాజస్థాన్ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. అందరూ వీటిని గమనిస్తున్నారు’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, రాజస్థాన్లో గడిచిన వారంరోజులుగా క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. సచిన్ పైలట్తోపాటు రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టు బాటపట్టారు. ముఖ్యమంత్రి వర్గం మాత్రం జైపూర్లోని ఓ హోటల్లో మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు. సీఎల్పీ సమావేశాలు కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే కేంద్ర మంత్రిపై ఆరోపణలు రావడం, అనంతరం ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు