Nitish Kumar: జేడీయూ పగ్గాలు.. మళ్లీ నీతీశ్ కుమార్ చేతికి
Nitish Kumar: జేడీయూ పార్టీ పగ్గాలను బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మరోసారి అందుకున్నారు. ఈ మేరకు పార్టీ సమావేశంలో ఆయనను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు.
పట్నా: బిహార్ (Bihar)లోని అధికార జనతా దళ్ (యునైటెడ్) పార్టీలో నాయకత్వ మార్పు జరిగింది. జేడీయూ (JDU) నూతన జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar)ను ఎన్నుకొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన క్షణాల్లోనే నీతీశ్ పార్టీ పగ్గాలు అందుకున్నారు.
రెండు రోజుల పాటు జరిగే జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం దిల్లీలో శుక్రవారం ప్రారంభమైంది. దీనిలో లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ నూతన అధ్యక్షుడిగా నీతీశ్ కుమార్ పేరును ఆయనే ప్రతిపాదించారు. ఇందుకు పార్టీ నేతలు కూడా అంగీకరించడంతో నీతీశ్ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకొన్నట్లు పార్టీ నేత కేసీ త్యాగీ వెల్లడించారు.
తప్పుగా అనువదించి.. క్షమాపణలు చెప్పిన సీఎం..!
జేడీయూ జాతీయ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ రాజీనామా చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నీతీశ్కు ముఖ్య సలహాదారుడిగా ఉన్న లలన్.. గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు దగ్గరయ్యారని ప్రచారం జరిగింది. అదే నితీశ్-లలన్ల మధ్య విభేదాలను సృష్టించిందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక, పార్టీకి నీతీశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. జనతాదళ్లోని శరద్ యాదవ్ వర్గం, లోక్ శక్తి పార్టీ, సమతా పార్టీ కలిసి 2003లో జనతా దళ్ (యునైటెడ్)గా ఏర్పడ్డాయి. నాటి నుంచి 2016 వరకు శరద్ యాదవ్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత నీతీశ్ కుమార్ పగ్గాలు అందుకున్నారు. నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. 2020లో ఆర్పీ సింగ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవ్వగా.. ఏడాదికే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నీతీశ్కు అత్యంత విశ్వాసపాత్రుడైన లలన్ సింగ్కు పార్టీ బాధ్యతలు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!