Kadapa: బీటెక్ రవిని కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారు: సీఎం రమేశ్
కడప కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న తెదేపా నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవిని భాజపా నేత సీఎం రమేశ్ మంగళవారం పరామర్శించారు.
కడప: కడప కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న తెదేపా నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవిని భాజపా నేత సీఎం రమేశ్ మంగళవారం పరామర్శించారు. 10 నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద ఆందోళన కేసుతోపాటు, క్రికెట్ బెట్టింగ్ కేసులో బీటెక్ రవికి న్యాయస్థానం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. రవిని కలిసిన తర్వాత సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడారు.
‘‘బీటెక్ రవిని 14న కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారు. కడప నగర శివార్లలో పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారు. ఆ తర్వాత పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లారు. నిజం చెప్పకపోతే చంపేస్తామని బీటెక్ రవిని బెదిరించారు. బతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది అని హెచ్చరించారు. మీడియా వల్లే రవి బయటపడ్డారు. ఈ వ్యవహారం అంతా మీడియాలో వస్తుందని తెలియగానే ఈ కేసు పెట్టారు. వైకాపాకు తొత్తుగా సీఐ అశోక్ రెడ్డి పని చేస్తున్నారు. అశోక్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతాం. ఒకరి కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. ఈ ఘటనను సీరియస్గా తీసుకుంటాం. అశోక్ రెడ్డి అండ్ టీమ్.. బీటెక్ రవిని కిడ్నాప్ చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలున్నాయి. సీఎం జగన్కు రోజులు దగ్గర పడ్డాయి. బీటెక్ రవిని అరెస్టు చేసిన తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాం’’ అని సీఎం రమేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు