BRS: దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలిసిన భారాస నేతలు

కాంగ్రెస్‌లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై  అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసింది.

Published : 18 Mar 2024 13:34 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై  అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసింది. స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసిన నేతలు ఈ మేరకు పిటిషన్‌ సమర్పించారు. ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని సభాపతి తమకు హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం మూడు నెలల్లో తీసులోవాలని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు