Chandrababu: ఏపీలో దళిత వ్యతిరేక ప్రభుత్వం: చంద్రబాబు
రాష్ట్రంలో సీఎం జగన్ పాపాలు పరాకాష్ఠకు చేరాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దళిత వైద్యాధికారి అచ్చెన్న చనిపోతే సీఎం నోరు మెదపలేదని మండిపడ్డారు.
గుడివాడ: రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్కు నిజమైన వారసుడు ఎన్టీఆరేనని చెప్పారు.
వైకాపా పాలనలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ పాపాలు పరాకాష్ఠకు చేరాయన్నారు. దళిత వైద్యాధికారి అచ్చెన్న చనిపోతే సీఎం నోరు మెదపలేదని మండిపడ్డారు. తెదేపా పాలనలో దళితుల అభ్యున్నతికి కృషి చేశామని ఆయన చెప్పారు. కేఆర్ నారాయణన్ను రాష్ట్రపతిగా ప్రతిపాదించి గెలిపించింది తెదేపానేనని తెలిపారు. దళిత నేత జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్ను చేశామని చంద్రబాబు గుర్తుచేశారు.
అనంతరం స్థానిక తెదేపా నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవాభావంతో క్రైస్తవ సంఘాలు పనిచేస్తున్నాయని కొనియాడారు. సీఎం జగన్ బాధ్యతను విస్మరించి దోపిడీనే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. పేదరిక నిర్మూలనకు క్రైస్తవ సంఘాలు కృషి చేస్తున్నాయని.. తెదేపాతో కలిసి పనిచేస్తే ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని చెప్పారు. తెదేపా హయాంలో దేవాలయాలు, చర్చిలు, మసీదులపై దాడులు జరిగితే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
-
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!