మమత ఆరోపణలతో షాకయ్యా!
బెంగాల్ గవర్నర్, సీఎం మమత మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. గవర్నర్ జగదీప్ ధన్ఖడ్......
కోల్కతా: బెంగాల్ గవర్నర్, సీఎం మమత మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ అవినీతిపరుడని, 1996 హవాలా కేసు ఛార్జి షీట్లో ఆయన పేరు ఉందంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను గవర్నర్ తిప్పికొట్టారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి తప్పుడు, అసత్య ఆరోపణలు చేస్తారని తానెప్పుడూ ఊహించలేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏ ఛార్జిషీట్లోనూ నాపేరు లేదు. ఏ కోర్టు నుంచి కూడా నేను స్టే తీసుకోలేదు. సీఎం మమత నుంచి ఇలాంటి ఆరోపణలు ఊహించలేదు. ఆమె ఆరోపణల్లో నిజం లేదు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, వాస్తవాలను వక్రీకరించడం దురదృష్టకరం. సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటివి తగవు’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నెహ్రూ జులాజికల్ పార్క్లో తెల్లపులి మృతి
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!