actor Nikhil: నారా లోకేశ్‌ను కలిసిన హీరో నిఖిల్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సినీ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ కలిశారు.  

Updated : 29 Mar 2024 23:12 IST

అమరావతి: సినీ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌ తెదేపాలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆయనకు తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు తెదేపా తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో పోస్టు చేసింది.  త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిఖిల్‌ తెదేపాలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. అయితే నిఖిల్‌ తెదేపాలో చేరలేదని ఆయన పీఆర్‌ టీీమ్‌ తెలిపింది. 

నిఖిల్‌ నటించిన ‘స్పై’ గతేడాది విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘స్వయంభు’ కోసం వర్క్‌ చేస్తున్నారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సంయుక్త కథానాయిక. ఇటీవల ‘కార్తికేయ 3’ అనౌన్స్‌ చేశారు. చందు మొండేటి దర్శకుడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు