పీసీసీ అధికార ప్రతినిధులకు లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధులకు కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 28 మందిని కేటాయించింది.

Published : 19 Apr 2024 04:16 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధులకు కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 28 మందిని కేటాయించింది. వీరంతా ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యలు, అంశాలపై స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ మీడియా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. అదే విధంగా మరో 9 మంది అధికార ప్రతినిధులకు గాంధీభవన్‌లో మీడియా సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు పీసీసీ మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌ సామ రాంమోహన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని