DK Shivakumar: ఒకే స్థానం నుంచి డీకే బ్రదర్స్ నామినేషన్.. కారణం ఇదేనట..!
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానం నుంచి ఆయన సోదరుడు డీకే సురేష్ నేడు నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తిగా మారింది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Election 2023) పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ గడువు నేటితో ముగిసింది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఆయా స్థానాలనుంచి రంగంలోకి దించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress) పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరు రూరల్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత డీకే సురేష్ (DK Suresh).. కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి ఆయన సోదరుడు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇలా డీకే బ్రదర్స్ ఒకేచోట నుంచి ఎందుకు నామినేషన్ వేశారనే విషయం ఆసక్తిగా మారింది.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి ఏప్రిల్ 17న నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి డీకే సురేష్ కూడా పోటీ చేస్తున్నట్లు కర్ణాటక కాంగ్రెస్ వెల్లడించింది. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సోదరులు ఒకే స్థానం నుంచి నామినేషన్లు దాఖలు చేయడంపై ఆసక్తి నెలకొంది. అయితే, ఒకవేళ డీకే శివకుమార్ నామినేషన్ తిరస్కరణకు గురైతే బ్యాకప్ ప్రణాళికలో భాగంగా ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఒకే ఒక్క ఎంపీ డీకే సురేష్ కావడం విశేషం. జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్కి వ్యతిరేకంగా రామనగర స్థానం నుంచి సురేష్ పోటీకి దిగుతారనే వార్తలు వినిపించాయి. అంతేకాకుండా శివకుమార్ పోటీ చేస్తున్న కనకపుర నియోజగవర్గం నుంచి ఓ బలమైన అభ్యర్థిని భాజపా దింపుతుందనే ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సురేష్ను పద్మనాభనగర్ నుంచి రంగంలోకి దించేందుకు పార్టీ సిద్ధమైంది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం సురేష్కు ఇష్టం లేదు. ఇలా భిన్న వాదనల నేపథ్యంలో శివకుమార్ పోటీచేస్తున్న స్థానం నుంచే సురేష్ నామినేషన్ దాఖలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం