KCR: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం: సీఎం కేసీఆర్
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ఓటేసే ముందు బాగా ఆలోచించి వేయాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
మంథని: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ఓటేసే ముందు బాగా ఆలోచించి వేయాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భారాస పుట్టిందే తెలంగాణ కోసమన్నారు. మంథనిలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని కేసీఆర్ మాట్లాడారు. పార్టీ అభ్యర్థి పుట్ట మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
‘‘జనం గెలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలి. పార్టీల చరిత్రలు చూసి ఓటేయాల్సిన అవసరం ఉంది. గిరిజన, ఆదివాసీల విషయంలో కాంగ్రెస్ సరైన విధానాలను అవలంబించలేదు. పీవీ మొదలుపెట్టిన రింగ్రోడ్డును పుట్ట మధు పూర్తి చేశారు’’ అని కేసీఆర్ తెలిపారు. రూ.1000 కోట్ల ప్రత్యేక నిధితో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్య ఐక్యత లోపిస్తోందని, అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ‘‘ బీసీ బిడ్డను గెలిపించాలని మంథని ప్రజలతో పంచాయతీ పెట్టుకుంటా. అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని కేసీఆర్ అన్నారు.
మేనిఫెస్టోలో లేకపోయినా ఎన్నో చేశాం..
ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా నీటి తీరువా బకాయిలు రద్దు చేశామని, నీటి తీరువా పన్ను కూడా ఎత్తివేశామని భారాస అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. పెద్దపల్లిలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి మనోహర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వ్యవసాయానికి కచ్చితంగా ప్రభుత్వ మద్దతు అవసరమని, అందుకే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
విదేశాల్లో సీటొస్తే.. విద్యార్థులకు రూ.20 లక్షలు ఇచ్చామని, జిల్లాకో మెడికల్ కళాశాల తీసుకొచ్చామని కేసీఆర్ చెప్పారు. ‘‘ కేంద్రం ప్రభుత్వం ఒక్క మెడికల్ కళాశాల కూడా ఇవ్వలేదు. ప్రజల డబ్బును ప్రజలకోసం వాడితే అభివృద్ధి ఇలాగే ఉంటుంది. భారాసకు మతం లేదు..కులం లేదు. అన్ని వర్గాలను కలుపుతూ వెళ్తున్నాం. 75 ఏళ్ల క్రితమే దళితులకు ప్రత్యేక పథకాలు తీసుకొస్తే.. ఇప్పుడు వాళ్ల పరిస్థితులు ఇలా ఉండేవా? అందుకే దళితబంధును తీసుకొచ్చాం’’ అని కేసీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్, సిసోదియా వంటి వారిని భాజపా ఆహ్వానించదు
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలను భాజపాలోకి ఎప్పటికీ ఆహ్వానించబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. -
వరుణ్కు టికెట్ ఇస్తే బాగుండేది: మేనకా గాంధీ
యూపీలోని పీలీభీత్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్ గాంధీకి భాజపా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన తల్లి మేనకా గాంధీ పేర్కొన్నారు. -
పోలింగ్ ముగియగానే విలేకర్ల సమావేశం నిర్వహించండి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ ముగిశాక అదే రోజు విలేకర్ల సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ తదితర మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
-
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
-
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
-
కాయ్ రాజా కాయ్.. గెలిచేది కూటమేనోయ్!
-
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి