భాజపా జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా బండి సంజయ్‌, సోము వీర్రాజు

ఏపీ, తెలంగాణ నుంచి భాజపా మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్ కుమార్‌ను జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 08 Jul 2023 23:40 IST

దిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా భాజపా జాతీయ కార్యవర్గంలోకి మరో పది మంది నేతలకు అవకాశం కల్పించారు. ఏపీ, తెలంగాణ నుంచి మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్ కుమార్‌ను జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా నియమిస్తూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. 

నాలుగురోజుల క్రితం ఏపీలో సోము వీర్రాజు, తెలంగాణలో బండి సంజయ్‌లను పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన భాజపా అధిష్ఠానం..  ఆ స్థానంలో పురందేశ్వరి, జి.కిషన్‌ రెడ్డి లను నియమించింది. తెలంగాణలో భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని భాజపా జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని