భాజపా జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులుగా బండి సంజయ్, సోము వీర్రాజు
ఏపీ, తెలంగాణ నుంచి భాజపా మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్ కుమార్ను జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.
దిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా భాజపా జాతీయ కార్యవర్గంలోకి మరో పది మంది నేతలకు అవకాశం కల్పించారు. ఏపీ, తెలంగాణ నుంచి మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్ కుమార్ను జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.
నాలుగురోజుల క్రితం ఏపీలో సోము వీర్రాజు, తెలంగాణలో బండి సంజయ్లను పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన భాజపా అధిష్ఠానం.. ఆ స్థానంలో పురందేశ్వరి, జి.కిషన్ రెడ్డి లను నియమించింది. తెలంగాణలో భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్గా ఈటల రాజేందర్కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని భాజపా జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా