PM Modi: మోదీతో దీదీ భేటీ.. ప్రొటోకాల్ ప్రకారమే కలిశానని వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో సమావేశమయ్యారు.
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)తో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని శుక్రవారం రాత్రికి రాజ్భవన్లోనే ఉండనున్నారు. ఈనేపథ్యంలో సీఎం మమత, ప్రధానితో సమావేశమయ్యారు. గతేడాది డిసెంబర్లో తమ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరుతూ దిల్లీలో కలిసిన తర్వాత మళ్లీ ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి.
మోదీతో భేటీ అనంతరం మమత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి రాష్ట్రాన్ని సందర్శిస్తే సీఎం వెళ్లి వారిని కలవడం ఓ ప్రొటోకాల్ అన్నారు. ఇది మర్యాదపూర్వక భేటీయేనని.. రాజకీయ అంశాలేవీ చర్చించలేదన్నారు. ఎందుకంటే ఇది రాజకీయ సమావేశం కాదని చెప్పారు. ఇదిలాఉండగా.. తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.1.18లక్షల కోట్ల బకాయిలు రావాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 2022 మార్చి నుంచి పెండింగ్లో ఉన్న దాదాపు 30 లక్షల మంది నరేగా కార్మికులకు ₹2,700 కోట్ల బకాయిల చెల్లింపును రాష్ట్ర ప్రభుత్వం సోమవారమే ప్రారంభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు