KTR: ఆ నిధులు తెస్తే కిషన్రెడ్డిని సన్మానిస్తాం: కేటీఆర్
నగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రూ.10వేల కోట్లు నిధులు తేవాలని.. అలా తెస్తే పౌర సన్మానం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మహానగర
ఎల్బీనగర్ అండర్పాస్, బైరామల్గూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రి
హైదరాబాద్: నగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రూ.10వేల కోట్లు నిధులు తేవాలని.. అలా తెస్తే పౌర సన్మానం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మహానగర అభివృద్ధికి భాజపా నేతలు పోటీపడాలని చురకలంటించారు. ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎల్బీనగర్ కూడలిలో జీహెచ్ఎంసీ నిర్మించిన అండర్పాస్, బైరామల్గూడలో ఫ్లైఓవర్లను కేటీఆర్ ప్రారంభించారు. నాగోల్, బండ్లగూడలో నాలాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
వరద ముంపు నివారణకు రూ.103 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేస్తామన్నారు. ఎల్బీ నగర్లో స్థలాల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడు నెలల్లో కొత్త పింఛన్లు ఇస్తామన్న మంత్రి.. అభివృద్ధి చేసేందుకు భాజపా కార్పొరేటర్లు కూడా ముందుకు రావాలన్నారు.
ఎస్ఆర్డీపీ పథకం కింద రూ.40 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ అండర్ పాస్, రూ. 29 కోట్లతో బైరామల్గూడ ఫ్లైఓవర్లను నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
భారాస నేత, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్