Nara Lokesh: ‘మీ బిడ్డను’ అంటూ.. జగన్‌ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్‌

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు.

Published : 29 Apr 2024 18:38 IST

అమరావతి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. ఈ చట్టంతో ఆస్తి ప్రజలదా? జగన్, భారతి రెడ్డిలకు చెందుతుందా?అని నిలదీశారు. జగన్ బొమ్మతో సర్వే రాళ్లు, ఆస్తి పట్టాపై జగన్ ఫొటో ఉండటం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తాజా చట్టంతో ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లు జగన్ దగ్గర ఉంటాయని ధ్వజమెత్తారు. ‘ మీ బిడ్డను’ అని జగన్‌ ఊరూరా తిరిగినప్పుడే అనుమానం వచ్చిందన్నారు. ఇక‌పై జ‌నం భూమి జ‌గ‌న్‌ది, జ‌నం ఆస్తి జ‌గ‌న్ సొంతమని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమ‌ల్లోకి వ‌చ్చేస‌రికి అర్థమైందని ఎక్స్‌లో పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని