Congress: కాంగ్రెస్‌లో చేరిన నారాయణపేట జడ్పీఛైర్‌ పర్సన్‌

 నారాయణపేట జడ్పీఛైర్‌ పర్సన్‌ వనజ కాంగ్రెస్‌లో చేరారు. 

Updated : 05 Nov 2023 19:21 IST

హైదరాబాద్‌: నారాయణపేట జడ్పీఛైర్‌ పర్సన్‌ వనజ కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు మక్తల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు కూడా కాంగ్రెస్‌లో చేరారు.

6న కొడంగల్‌, 10న కామారెడ్డిలో రేవంత్‌ నామినేషన్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొడంగల్‌ నియోజవర్గం నుంచి బరిలోకి దిగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నవంబర్‌ 6న నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పదో తేదీన కామారెడ్డి స్థానానికి నామినేషన్‌ వేస్తారని, అదే రోజున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కామారెడ్డిలో పర్యటించనున్నట్లు తెలిపాయి. మరోవైపు ఆదివారం 60 మంది అభ్యర్థులకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పార్టీ బీ ఫారాలు అందజేశారు. మరో 37 మంది అభ్యర్థులు బీఫారాలు తీసుకోవాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని