BJP: ‘విపక్ష కూటమి త్వరలో కూలిపోతుంది’: భాజపా
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ అని భాజపా వ్యాఖ్యానించింది.
కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించి కాంగ్రెస్(Congress)కు మమతా బెనర్జీ(Mamata Banerjee) పార్టీ తృణమూల్ కాంగ్రెస్ షాకిచ్చింది. దీనిపై భాజపా స్పందించింది. ‘ఇండియా’ కూటమి అసహజమైనదని, అది త్వరలోనే కూలిపోతుందని కేంద్రమంత్రులు, కమలం పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు.
‘ఆ కూటమి అసహజమైనది. ఎందుకంటే బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎం.. తృణమూల్కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాయి. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ కార్యకర్తలు.. ఆ పార్టీల కార్యకర్తలపై దాడి చేశారు. మమతాజీకి గ్రౌండ్ రిపోర్టుపై అవగాహన ఉంది. ఆమె నిర్ణయం కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ. మమత, నీతీశ్ కుమార్, అఖిలేశ్ యాదవ్ వంటి నేతలు లేకుండా ఆ కూటమి మనుగడ ఎలా సాధిస్తుంది..?’ అంటూ కాంగ్రెస్ను విమర్శించారు.
కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA)పై ఉమ్మడి పోరు కోసం జట్టుగా ఏర్పడిన విపక్షాల ‘ఇండియా (INDIA Bloc)’ కూటమి బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. మమత ప్రకటన తర్వాత.. ఆప్ నుంచి ఇదే తరహా స్పందన వచ్చింది. పంజాబ్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించింది. రాజకీయ కూటమిలో సీట్ల పంపకం అనేది సవాలేనని ఆమ్ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. విపక్ష పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడం వల్లే ఈ ప్రకటనలు వెలువడుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM