Congress: ‘మోదీ 51 నిమిషాల ప్రసంగంలో.. 44 సార్లు కాంగ్రెస్ పేరు’
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(Modi) చేసిన విమర్శలపై కాంగ్రెస్(Congress) స్పందించింది. ఆయన విమర్శలను చూస్తుంటే.. భాజపా పాలిత రాష్ట్రంలో అభివృద్ధే జరిగినట్లు కనిపించడం లేదని వ్యాఖ్యలు చేసింది.
దిల్లీ: కొద్దినెలల్లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో పర్యటించిన ప్రధాని మోదీ(Modi).. కాంగ్రెస్(Congress)పై ధ్వజమెత్తారు. మోదీ ప్రసంగం మొత్తం తమ పార్టీ పేరుతోనే నిండిపోయిందని హస్తం పార్టీ సీనియర్ నేత పవన్ ఖేడా(Pawan Khera) విమర్శించారు.
‘ప్రధాని మోదీ తన 51 నిమిషాల ప్రసంగంలో కాంగ్రెస్ పేరును 44 సార్లు ప్రస్తావించారు. 18 ఏళ్లపాటు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో పదేపదే కాంగ్రెస్పై విమర్శలు చేశారు. దానర్థం.. మధ్యప్రదేశ్లో ఇన్నేళ్లపాటు మీ ప్రభుత్వం చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించలేదనేగా’ అని విమర్శలు చేశారు.
‘మామ’ మనసులో కుర్చీ టెన్షన్.. అసెంబ్లీ సీటుపై సస్పెన్స్!
రానున్న అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం భాజపా రెండు విడతల్లో ఇప్పటికే 78 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ఇంకా ఈ ప్రక్రియను మొదలుపెట్టలేదు. దీనిపై స్పందిస్తూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమని, అన్ని చూసుకొని ముందుకు వెళ్తామని ఖేడా అన్నారు. గెలుపు పట్ల ఆందోళనగా ఉన్నవారు ఏం చేస్తారో చూడనివ్వడంటూ వ్యాఖ్యలు చేశారు.
సోమవారం భోపాల్లో జరిగిన కార్యకర్త మహాకుంభ్ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తుప్పు పట్టిన ఇనుములా మారిపోయిందన్నారు. ‘ఈ రాష్ట్రంలో గత 20 ఏళ్లుగా భాజపా అధికారంలో ఉంది. అంటే ప్రస్తుతం మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత అదృష్టవశాత్తూ కాంగ్రెస్ పాలనను చూడలేదు’ అంటూ ఎండగట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్, సిసోదియా వంటి వారిని భాజపా ఆహ్వానించదు
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలను భాజపాలోకి ఎప్పటికీ ఆహ్వానించబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. -
వరుణ్కు టికెట్ ఇస్తే బాగుండేది: మేనకా గాంధీ
యూపీలోని పీలీభీత్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్ గాంధీకి భాజపా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన తల్లి మేనకా గాంధీ పేర్కొన్నారు. -
పోలింగ్ ముగియగానే విలేకర్ల సమావేశం నిర్వహించండి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ ముగిశాక అదే రోజు విలేకర్ల సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ తదితర మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?