పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల

ఐదేళ్ల జగన్‌ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.

Published : 29 Apr 2024 12:05 IST

పొన్నూరు: ఐదేళ్ల జగన్‌ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గంలో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ జరిగిందన్నారు. రేషన్‌ మాఫియా లారీకి అడ్డొచ్చాడని ఉద్యోగిని హతమార్చారని ఆరోపించారు. దళితులను ఎమ్మెల్యే కిలారు రోశయ్య బెదిరించి అనుమర్లపూడిలో వారి భూమి లాక్కొన్నారన్నారు. ఆయనపై సీఎం జగన్‌ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. పొన్నూరును గంజాయి మాఫియాకు అడ్డాగా మార్చారని విమర్శించారు. పొన్నూరులో రోడ్డు విస్తరణ బాధితులకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని