Ap News: కొప్పర్రు ఘటన.. 16 మంది అనుమానితులు అరెస్టు: ఎస్పీ విశాల్‌ గున్నీ

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో తెదేపా నాయకురాలు శారద ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎస్పీ విశాల్‌ గున్నీ స్పందించారు. ఈ ఘటనకు

Updated : 25 Sep 2021 21:43 IST

గుంటూరు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో తెదేపా నాయకురాలు శారద ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎస్పీ విశాల్‌ గున్నీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పెదనందిపాడు పోలీసులు 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ సీఐ, పొన్నూరు రూరల్, పట్టణ సీఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సోమవారం అర్ధరాత్రి తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తెదేపా మాజీ జడ్పీటీసీ బత్తిని శారద ఇంటి వద్దకు వచ్చిన వైకాపా కార్యకర్తలు ఆమె ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి దూరి సామగ్రి ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రి, 6 ద్విచక్ర వాహనాలకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని