TS News: హిట్లర్‌ పుస్తకాలు చదివి నియంతలా మారారు: కోదండరాం

హిట్లర్‌ పుస్తకాలు చదివి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలా మారారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు.

Updated : 24 Sep 2022 15:08 IST

సీఎం కేసీఆర్‌పై ధ్వజం

కవాడిగూడ, న్యూస్‌టుడే: హిట్లర్‌ పుస్తకాలు చదివి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలా మారారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందన్నారు.  ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను ప్రైవేటు దోపిడీకి వదిలేసిందని ఆరోపించారు. డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్‌రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలమల్లేశ్‌, ప్రొ.లక్ష్మణ్‌, విరసం నేత రాంకీ, డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, నాయకుడు రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని