Telangana Formation Day: తెలంగాణ ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదు: కోదండరామ్‌

అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణను సాధించుకున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు.

Updated : 02 Jun 2022 13:07 IST

హైదరాబాద్‌: అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణను సాధించుకున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘తెలంగాణ ప్రజలు చాలా ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదు. అనేక మంది సుదీర్ఘ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే రాష్ట్రం అవతరించింది. తెలంగాణ కోసం చాలా మంది యువకులు బలిదానాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు నిరంకుశ పాలన నడుస్తోంది. ఒక వ్యక్తి కుటుంబం చేతిలో బందీ అయింది.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తాం. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడింది.. ప్రజలు దాని కోసం ఉద్యమాలు చేయాలి. ఉద్యమకారులు ఒకతాటిపైకి రావాలి. 6వ తేదీ ఇందిరాపార్కు వద్ద ఆత్మగౌరవ దీక్ష చేపట్టబోతున్నాం. ఇందులో ఉద్యమ కారులందరూ పాల్గొనాలి’’ అని కోదండరామ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని