West benagal: వాళ్ల చేతులు నరికేస్తా.. టీఎంసీ ఎమ్మెల్యే హెచ్చరిక.. ఆపై క్షమాపణ!
తన నియోజకవర్గంలో ఉన్న ఓ ప్లే గ్రౌండ్ను సొంత పార్టీకి చెందిన వ్యక్తులే కబ్జా చేస్తున్నారని ఉత్తర 24 పరగణా జిల్లా కమర్హతి ఎమ్మెల్యే, తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రా ఆరోపించారు. ..
కోల్కతా: తన నియోజకవర్గంలో ఉన్న ఓ ప్లే గ్రౌండ్ను సొంత పార్టీకి చెందిన వ్యక్తులే కబ్జా చేస్తున్నారని ఉత్తర 24 పరగణా జిల్లా కమర్హతి ఎమ్మెల్యే, తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రా ఆరోపించారు. స్థానిక ఎంపీతో కలిసి ప్లే గ్రౌండ్ను సుందరీకరించాలని తాను ప్రణాళికలు వేస్తుంటే.. కొందరు ఆ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆక్రమణలకు పాల్పడుతున్నవారిలో ముగ్గురు తనకు తెలుసని వారిపై కేసు పెట్టనున్నట్లు చెప్పారు. ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. ప్లే గ్రౌండ్ను కాపాడటం కోసం ప్రజా ఉద్యమం చేపడతానని అన్నారు. ఒకవేళ తనను వాళ్లు కొనాలని చూసినా, బెదిరించినా వెనక్కి తగ్గేదే లేదని, కబ్జాదారుల చేతుల్ని నరికేస్తానని హెచ్చరించారు. అవసరమైతే సీఎం మమతా బెనర్జీని కలిసి పరిస్థితి వివరిస్తానని చెప్పారు. కాగా.. చేతులు నరికేస్తానని ఎమ్మెల్యే చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన స్పందించారు. తను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని.. క్షమాపణ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సీనియర్ నేత సుశీల్కుమార్ కన్నుమూత
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక