WTC Final: ఇదేం అంపైరింగ్ తమాషా బాబోయ్!
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఆటగాళ్లు అప్పీల్ చేయకున్నా, సమీక్ష సమయం దాటేసినా మైదానంలోని ఇద్దరు అంపైర్లు బ్యాట్స్మన్ ఔటయ్యాడా లేదో తెలుసుకొనేందుకు మూడో అంపైర్ను సంప్రదించారు. దాంతో ఇదేం అంపైరింగ్ తమాషా బాబోయ్!....
ఇంటర్నెట్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఆటగాళ్లు అప్పీల్ చేయకున్నా, సమీక్ష సమయం దాటేసినా మైదానంలోని ఇద్దరు అంపైర్లు బ్యాట్స్మన్ ఔటయ్యాడా లేదో తెలుసుకొనేందుకు మూడో అంపైర్ను సంప్రదించారు. దాంతో ఇదేం అంపైరింగ్ తమాషా బాబోయ్! అంటూ కొందరు మాజీ క్రికెటర్లు, అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 40వ ఓవర్ను ట్రెంట్ బౌల్ట్ విసిరాడు. ఆఖరి బంతిని విరాట్ కోహ్లీ లెగ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి అతడి బ్యాటుకు తగలకుండానే కీపర్ చేతుల్లో పడింది. బ్యాటుకు తాకినట్టు స్వల్ప శబ్దం వినిపించడంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్ను బౌల్ట్ సంప్రదించాడు. సమీక్ష తీసుకోవాలని కోరాడు. సందిగ్ధంలో ఉన్న కేన్ 15 సెకన్ల సమయం ముగిసినా సమీక్ష అడగలేదు.
ఏం జరిగిందో ఏమోగానీ! హఠాత్తుగా మైదానంలోని అంపైర్లు మైకేల్ గాఫ్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్ చర్చించుకొని మూడో అంపైర్ రిచర్డ్ కెటిల్బరోను సంప్రదించారు. బ్యాటుకు బంతి తగిలిందో లేదో చూడాలని సమీక్ష కోరారు. దీంతో ఒక్కసారిగా అందరూ గందరగోళంలో పడ్డారు. డీఆర్ఎస్ అడగకుండానే అంపైర్లు సమీక్ష కోరడమేంటని ఆశ్చర్యపోయారు. వెంటనే విరాట్ కోహ్లీ వారివద్దకు వెళ్లి ఇదేంటని ప్రశ్నించాడు. మొత్తంగా సమీక్షలో అతడి బ్యాటుకు బంతి తగల్లేదని తేలింది. టీమ్ఇండియా సారథి ఊపిరి పీల్చుకున్నా అడక్కుండానే సమీక్ష తీసుకోవడమేంటని విమర్శలు మొదలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?