Sheetal Devi: కాలితో విల్లు ఎత్తి.. నోటితో నారిని లాగి
ఫొకోమేలియా రుగ్మత కారణంగా రెండు చేతులు పోయినా ఆమె అధైర్యపడలేదు. ఓ వైపు పేదరికం వెంటాడుతున్నా.. పట్టుదలతో విల్లును ఎక్కుపెట్టి పసిడి పతకాలు సాధించిన తొలి పారా ఆర్చర్గా నిలిచింది.
ఆర్చరీలో అదరగొడుతున్న శీతల్
ఆర్చరీలో రాణించాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి.. తీక్షణత ఉండాలి. రెండు చేతులు సరిగా ఉన్నవాళ్లే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమవుతుంటారు. అలాంటిది రెండు చేతులు లేకుండా బాణాలను వేయాలని ప్రయత్నిస్తే! ఈ ఊహే కష్టంగా అనిపిస్తుంది కదా! కానీ శీతల్ దేవి (Sheetal Devi)కి మాత్రం కష్టం కాదు! పైగా ఇష్టం కూడా! అందుకే పారా ఆసియా (Asian Para Games 2022) క్రీడల్లో పసిడితో మెరిసింది ఈ అమ్మాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పతకాలు సాధించింది. ఇందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి. ఒకే క్రీడల్లో రెండు పసిడి పతకాలు సాధించిన తొలి భారత పారా ఆర్చర్ కూడా శీతలే.
నిరుపేద కుటుంబంలో పుట్టినా..
జమ్ముకశ్మీర్కు చెందిన శీతల్ ఫొకోమేలియా అనే రుగ్మత కారణంగా రెండు చేతులూ పోగొట్టుకుంది. తల్లిదండ్రులు మాన్సింగ్, శక్తిదేవిలు ఇద్దరూ పనికి వెళ్తేనే ఇళ్లు గడిచేది. తండ్రి మాన్ పొలం పనులు చేస్తే.. ఆమె అమ్మ మేకలు కాసేది. ఈ నేపథ్యంలో శీతల్ కిస్తావర్లోని లౌదర్ గ్రామంలో ఆమె లోకంలో ఆమె బతికేది. అలాంటిది అంతర్జాతీయ ఆర్చర్ అవుతానని అనుకోలేదు. భారత సైన్యం నిర్వహించిన ఓ క్రీడా ఈవెంట్ ఆమెకు వరమైంది. ఆమెలో చురుకుదనం చూసిన భారత సైన్యం.. క్రీడల వైపు ప్రోత్సహించింది. అయితే బాగా చదువుకుని ఉపాధ్యాయురాలు అయి కుటుంబానికి అండగా నిలవాలని శీతల్ అనుకునేది. తనకు కృత్రిమ చేతులు ఉంటే జీవితంలో ముందుకు వెళ్లొచ్చని భావించేది కానీ ఎప్పుడూ చేతులు అమర్చుకునే ప్రయత్నం చేయలేదు. చేతులు లేవని అమె ఎప్పుడూ బాధపడేది కాదు.. కాళ్లనే చేతులుగా మలుచుకుని పనులు చేసుకునేది.
అలా ఆర్చరీ మొదలుపెట్టి
భారత సైన్యం ప్రోత్సహంతో ఆటలపై ఆసక్తిని పెంచుకున్న శీతల్ను ఆర్చరీ ఆకర్షించింది. అయితే ఆర్చరీలో రెండు చేతులు ఉంటేనే గురి కుదురుతుంది. అలాంటిది చేతులు లేకుండానే ఆర్చరీ నేర్చుకోవాలన్న తన ఆశలు నెరవేరతాయని అనుకోలేదు. పైగా భయపడింది. అయితే కోచ్ వేద్వాన్ ప్రోత్సాహంతో ఆర్చరీలో అడుగుపెట్టింది. పారా స్విమ్మర్ శరత్ గైక్వాడ్ కూడా ఆమెకు ధైర్యాన్ని నూరిపోశాడు. తన గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే కట్రా గ్రామానికి వచ్చి సాధన చేసేది. చేతులు లేని తాను ఎలా విల్లు పట్టుకుని బాణాలు వేస్తానో అనుకున్న శీతల్.. నెమ్మదిగా అలవాటు చేసుకుంది. ఒక కుర్చీలో కూర్చొని కుడి కాలితో బాణాన్ని పట్టుకుని ఆ తర్వాత కుడి భుజం ఆధారం చేసుకుని నోటితో విల్లు నారిని లాగి లక్ష్యాన్ని చూసి కొట్టేది. దీంతో నెమ్మదిగా భయం స్థానంలో ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది. టోర్నీల్లోనూ పాల్గొనడం మొదలుపెట్టింది. రెండు చేతులు ఉన్న ఆర్చర్లతో పోటీపడి గెలిచేది.
ప్రపంచ ఆర్చరీలో సత్తా చాటి
ఈ జులైలో చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో రజత పతకం గెలిచి రెండు చేతులు లేకుండా ఈ ఘనత సాధించిన తొలి ఆర్చర్గా శీతల్ రికార్డుల్లో నిలిచింది. ఈ టోర్నీకి ముందు జ్వరం, కడుపు నొప్పి లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పతకం గెలవడం ఆమె పట్టుదలకు నిదర్శనం. ఫైనల్లోనూ పోరాడినా శీతల్ 138-140తో ఒజ్నూర (టర్కీ) చేతిలో తలొంచింది. ప్రస్తుతం ఒలింపిక్ గోల్డ్క్విస్ట్ మద్దతుతో షీతల్ ఇబ్బంది లేకుండా ఆర్చరీలో కొనసాగుతోంది. టోర్నీ టోర్నీకి మెరుగవుతోంది. 10 మీటర్ల ఇన్నర్ సర్కిల్లో బాణాలను స్థిరంగా వేస్తోంది. వచ్చే ఏడాది పారిస్ పారాలింపిక్స్లో పాల్గొని పతకం గెలవాలనేది శీతల్ లక్ష్యం.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ