FIFA: ప్రాణం తీసిన సెల్ఫ్ గోల్..!
క్రీడల్లో బెట్టింగులు చేరితే ఆటగాళ్లకు ఎంత ప్రాణాంతకమో 1994లో ఫుట్బాలర్ ఎస్కొబార్ హత్య ప్రపంచానికి తెలియజేసింది. ఆ ఏడాది ప్రపంచకప్లో చేసిన ఒక్క సెల్ఫ్గోల్ అతడి ప్రాణాలను బలిగొంది.
ఇంటర్నెట్ డెస్క్: కొలంబియా 1994లో ప్రపంచకప్ తొలి మ్యాచ్లో రొమానియా చేతిలో 3-1 తేడాతో ఓడిపోయింది. ఆ జట్టు రెండో మ్యాచ్లో అమెరికాతో తలపడింది. నాకౌట్ దశకు చేరాలంటే ఇది గెలిచి తీరాలి. కానీ, మ్యాచ్కు కొలంబియా కీలక ఆటగాడు గాబ్రియేల్ గోమేజ్ను ఆడిస్తే జట్టు మొత్తాన్ని చంపుతామని బెదిరింపులు వచ్చాయని కోచ్ మటురాన జట్టు ఆటగాళ్లతో జరిగిన సమావేశంలో కన్నీరు పెట్టుకొన్నాడు. కొలంబియా ఆటగాళ్ల విలువ అంతర్జాతీయంగా పెరగకుండా ఆ దేశ ఫుట్బాల్ క్లబ్ ఓనర్ల కోసం అతడు అలా చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. మటురాన కన్నీటితో కొలంబియా ఆటగాళ్లు చేసేది లేక గోమేజ్ను పక్కనపెట్టి ఈ మ్యాచ్లో బరిలోకి దిగారు.
కీలక ఆటగాళ్లు లేకపోయినా కొలంబియానే ఈ మ్యాచ్లో హాట్ఫేవరెట్. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి కొలంబియా ఆటగాళ్లు అమెరికా గోల్ పోస్టులపై భీకరంగా దాడులు చేశారు. కానీ, అమెరికన్ల రక్షణ వలయాన్ని మాత్రం ఛేదించలేకపోయారు. మ్యాచ్ తొలి అర్ధగంట పూర్తయ్యాక అమెరికా ప్రతిదాడులు ప్రారంభించింది. స్టెవార్ట్, హార్కీస్లు కొలంబియా గోల్పోస్టులపై దాడులకు నేతృత్వం వహించారు. 35వ నిమిషంలో కొలంబియా గోల్పోస్టు సమీపంలో హర్కీస్ బంతిని స్టెవార్ట్ దిశగా కొట్టాడు. కానీ, కొలంబియా ఆటగాడు ఎస్కొబార్ బంతిని స్టీవార్ట్కు అందకుండా చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడి షాట్కు బంతి అనూహ్యంగా కొలంబియా గోల్పోస్టులోకి వెళ్లింది. అమెరికాకు మ్యాచ్లో 1-0 ఆధిక్యం లభించింది.
కొలంబియాకు ఈ సెల్ఫ్గోల్ ఓ పెద్దషాక్. ఆ తర్వాత మ్యాచ్ 52వ నిమిషంలో అమెరికా ఆటగాడు స్టెవార్ట్ గోల్ చేయడంతో అమెరికాకు తిరుగులేని ఆధిక్యం లభించింది. మ్యాచ్ చివరి నిమిషం (90)లో కొలంబియా ఆటగాడు వాలెన్సియా గోల్ చేశాడు. అప్పటికే 2-1 తేడాతో జట్టు ఓటమి ఖాయమైంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్తో జరిగిన మ్యాచ్ను 0-2తేడాతో కొలంబియా గెలిచింది. కానీ, అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఓటమి కారణంగా లీగ్ తరువాత ఇంటికి పోవాల్సి వచ్చింది. ఎస్కొబార్ సెల్ఫ్గోల్ లేకపోతే.. అమెరికాతో మ్యాచ్ డ్రా అయి నాకౌట్కు అవకాశాలు ఉండేవని కొలంబియా ఫుట్బాల్ అభిమానులు భావించారు. దీంతో స్వదేశంలో ఎస్కొబార్పై తీవ్ర ఆగ్రహం నెలకొంది.
కొలంబియా గ్రూప్ దశలోనే టోర్నీ బయటకు రాగానే.. ఎస్కొబార్ స్వదేశానికి వచ్చేశాడు. ఐదు రోజుల తర్వాత అతడు మిత్రుడితో కలిసి ఓ నైట్ క్లబ్కు వెళ్లాడు. అక్కడ తెల్లవారుజామున 3 గంటల వరకు ఉండి తర్వాత బయట పార్కింగ్కు చేరుకొన్నాడు. అక్కడ అప్పటికే వేచి ఉన్న కొందరు వ్యక్తులు ఎస్కొబార్తో గొడవ పెట్టుకొన్నారు. వారిలో ఇద్దరు హఠాత్తుగా తుపాకులు తీసి ఎస్కొబార్ను 6 సార్లు కాల్చారు. కాల్చే ప్రతిసారి ‘గో.... గో..’ అని పెద్దగా అరిచారు. వాస్తవానికి దక్షిణ అమెరికాలో గోల్ చేసిన సమయంలో ఫుట్బాట్ వ్యాఖ్యాతలు ‘గో’ అనే అంటారు. ఇక్కడ హంతకులు కూడా అలానే అరిచారు. దాదాపు అరగంట తర్వాత ఎస్కొబార్పై దాడి జరిగినట్లు ప్రపంచానికి తెలిసింది. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు ప్రకటించారు.
ఎస్కొబార్ అంతిమ యాత్రలో 1,20,000 మందికి పైగా పాల్గొన్నారు. మర్నాడే ఈ హత్యకు పాల్పడిన ఓ డ్రగ్ కార్టెల్ బాడీగార్డ్ను అరెస్టు చేశారు. అతడు శాంటియాగో గాలన్ అనే డ్రగ్డాన్ కింద పనిచేస్తాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో కొలంబియా ఓటమితో శాంటియాగో బెట్టింగ్లో పెద్దమొత్తం పోగొట్టుకొన్నాడు. ఇతడిని కూడా అరెస్టు చేశారు. వీరిపై ఈ విచారణ కూడా సినిమాను తలపించేలా మలుపులు తిరిగింది. నిందితులకు శిక్షపడినా.. సత్ప్రవర్తన కారణంగా శిక్షాకాలాన్ని తగ్గించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్