Arshdeep Singh: సఫారీ జట్టుపై ఐదు వికెట్లు.. తొలి పేసర్గా అర్ష్దీప్ సింగ్ రికార్డు
దక్షిణాఫ్రికాపై (SA vs IND) తొలి వన్డేలో చెలరేగిన భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో (SA vs IND) టీమ్ఇండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ (5/37) ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. అతడితోపాటు అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో సౌతాఫ్రికా 116 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) అరుదైన ఘనతను సాధించాడు. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి పేసర్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు వన్డేల్లో దక్షిణాఫ్రికాపై భారత స్పిన్నర్లే ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు.
అప్పుడు పిచ్పై పెద్దగా మూమెంట్ లేదు
మ్యాచ్ ఇన్నింగ్స్ బ్రేక్ సందర్భంగా అర్ష్దీప్ సింగ్ ప్యాడ్కాస్ట్తో మాట్లాడాడు. ‘‘వన్డేల్లో ఇప్పటి వరకు గొప్ప గణాంకాలు నమోదు చేయలేకపోయా. ఈసారి మాత్రం అద్భుతమైన ఆరంభం దక్కింది. పిచ్ నుంచి చాలా సహకారం దొరికింది. మ్యాచ్కు ముందు పిచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు పెద్దగా మూమెంట్ ఉండదని అనుకున్నాం. అనూహ్యంగా బౌలింగ్ చేసే సమయంలో స్వింగ్కు బాగా అనుకూలంగా మారింది. దీంతో వికెట్ టు వికెట్ బంతులను సంధిస్తే చాలని భావించాం. అలాగే బౌలింగ్ వేయడంతో వికెట్లు దక్కాయి. చాలా రోజుల తర్వాత 50 ఓవర్ల క్రికెట్ ఆడా. ఇబ్బంది పడతానేమోనని అనిపించినా.. త్వరగానే కుదురుకున్నా. ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం కొత్త ఉత్సాహాన్నిస్తోంది’’ అని అర్ష్దీప్ వ్యాఖ్యానించాడు.
మరికొన్ని విశేషాలు..
- ఒకే మ్యాచ్లో 9 వికెట్లను భారత పేసర్లు తీయడం ఇదే తొలిసారి. అంతకుముందు మొహాలీలో (1993) 8 వికెట్లు, సెంచూరియన్లో (2013) 8 వికెట్లను పడగొట్టారు.
- దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్లు నలుగురు. ఇప్పుడు అర్ష్దీప్ కాకుండా.. సునీల్ జోషి (నైరోబి 1999లో) 5/6, చాహల్ (సెంచూరియన్ 2018లో) 5/22, రవీంద్ర జడేజా (కోల్కతా 2023లో) 5/33.
- గతంలో 2018లో సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా 118 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు 116 పరుగులకు ఆలౌటై.. అత్యల్ప స్కోరును నమోదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం