Riyan Parag: దేశవాళీ క్రికెట్లో దంచేస్తున్న పరాగ్... జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తాడా?
ఆటిట్యూడ్ ఎక్కువ.. ఆట తక్కువ అంటూ సోషల్ మీడియాలో అతణ్ని ట్రోల్ చేసినవాళ్లు.. ప్రస్తుతం అతని ఆట తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. దేశవాళీ మ్యాచ్ల్లో అదరగొడుతూ.. బ్యాట్తో మాత్రమే కాకుండా బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నాడు.
రియాన్ పరాగ్ (Riyan Parag).. ఈ పేరు వినగానే ఒక విఫలమైన క్రికెటరే గుర్తుకొస్తాడు. ఒక ఐపీఎల్ సీజన్లో బాగా ఆడి పేరు తెచ్చుకున్న ఈ అసోం ఆల్రౌండర్.. ఆ తర్వాత విఫల బాట పట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. అలాంటి ఆటగాడు వరుసగా 7 అర్ధసెంచరీలు చేస్తే ఎలా ఉంటుంది. అందులోనూ బంతులు వృథా కాకుండా కచ్చితంగా పరుగులు చేయాలనే ఒత్తిడి ఉండే టీ20 ఫార్మాట్లో ఇంతటి స్థిరత్వం చూపిస్తే ఏమనిపిస్తుంది! కానీ పరాగ్ ఇదే చేసి చూపించాడు.
టీ20ల్లో వరుసగా మూడు అర్ధసెంచరీలు చేయడమే కష్టం. ఈ ఫార్మాట్లో నిలకడగా ఆడి 50 దాటాలంటే కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటిది 3 కాదు.. 7 అర్ధసెంచరీలు చేయడమంటే! కచ్చితంగా విశేషమే. 21 ఏళ్ల రియాన్ పరాగ్ ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు ఒకవైపు ప్రపంచకప్లో రికార్డులు బద్దలవుతుంటే ఇటు దేశవాళీలోనూ అతడీ రికార్డు సృష్టించి వార్తల్లోకి వచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో పరాగ్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటిదాకా ఆడిన 8 ఇన్నింగ్స్ల్లో అతడు 490 పరుగులు చేశాడంటే పరాగ్ జోరు అర్థం చేసుకోవచ్చు.
9 మ్యాచ్ల్లో 8 అర్ధసెంచరీలు
ఆరు మ్యాచ్ల్లో 6 అర్ధసెంచరీలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించడమే కాదు.. ఈ సీజన్లో దేవధర్ ట్రోఫీ, ముస్తాక్ అలీ టోర్నీల్లో కలిపి 9 దేశవాళీ మ్యాచ్ల్లో 8 సార్లు 50 పరుగులు దాటాడు పరాగ్.. ఇందులో ఓ మెరుపు సెంచరీ కూడా ఉంది. 193 స్టైక్రేట్తో పరాగ్ పరుగులు చేశాడు. ముస్తాక్అలీ టోర్నీలో వరుసగా బిహార్, సర్వీసెస్, సిక్కిం, చండీగఢ్, హిమాచల్ప్రదేశ్పై అర్ధసెంచరీలు చేసి... వీరేంద్ర సెహ్వాగ్, డెవోన్ కాన్వే, వార్నర్, మసకద్జ, కమ్రాన్ అక్మల్, బట్లర్ సరసన నిలిచిన పరాగ్.. కేరళపై అజేయంగా 57 పరుగులు సాధించి ఈ కొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ముస్తాక్ అలీ టోర్నమెంట్లో అతడే టాప్ స్కోరర్. ఈ టోర్నీకి ముందు దేవధర్ ట్రోఫీలో పరాగ్ జోరుకు పునాది పడింది. చెత్త షాట్లను పక్కనపెట్టి తెలివిగా ఆడడం మొదలుపెట్టిన ఈ కుర్రాడు.. కుదురుకున్నాక పరుగుల వరద పారించాడు.
ఐపీఎల్లో చెత్తగా ఆడినా..
2023 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడుతూ దారుణంగా విఫలమయ్యాడు పరాగ్. 7 మ్యాచ్లు ఆడి 78 పరుగులే చేశాడు. దీంతో ఆటిట్యూడ్ ఎక్కువ.. ఆట తక్కువ అంటూ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకవైపు వరుస వైఫల్యాలు. మరోవైపు విమర్శలు ఈ కుర్రాడిలో నిరాశను నింపాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ను ఎదుర్కొన్నాడు. ఈ విమర్శలు తననెంతో బాధపెట్టాయని బాహాటంగానే బాధను ప్రదర్శించాడు. రాజస్థాన్ రాయల్స్ అతడిని వదులుకోవడం ఖాయం అనే మాటలు కూడా పడ్డాడు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలోనూ పరాగ్ మళ్లీ పుంజుకున్నాడు. బ్యాటింగ్పై దృష్టి పెట్టిన అతడు లోపాలు దిద్దుకుని దేశవాళీ పోటీల్లో దిగాడు. నెమ్మదిగా ఈ అసోం కుర్రాడు ఫామ్ అందుకున్నాడు. దేశవాళీ మ్యాచ్ల్లో అదరగొడుతున్నాడు. కేవలం బ్యాటింగ్లోనే మాత్రమే కాదు బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నాడు.
ముస్తాక్అలీ టోర్నీలో సర్వీసెస్పై 9 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. ఇప్పటిదాకా 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీకి ముందు దేవధర్ ట్రోఫీలో ఈస్ట్జోన్కు ఆడుతూ 354 పరుగులు, 11 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్గా నిలిచాడు పరాగ్. వెస్ట్జోన్తో మ్యాచ్లో 68 బంతుల్లోనే అజేయంగా 105 పరుగులు చేసి సత్తా చాటాడు. తాజా ప్రదర్శనలతో పరాగ్ రాజస్థాన్ రాయల్స్ను ఆలోచనలో పడేయడమే కాదు... భారత సెలక్టర్ల దృష్టిలో కూడా పడ్డాడు. ఈ జోరు ప్రదర్శిస్తే ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ని మున్ముందు టీ20 సిరీస్లో భారత జట్టులో చూడొచ్చు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?