Mohsin Naqvi - BCCI: ఒకట్రెండు రోజుల్లో ఆసియా కప్ ట్రోఫీ భారత్కు.. : బీసీసీఐ

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ నఖ్వీ ఒకటి లేదా రెండు రోజుల్లో ఆసియా కప్ (Asia Cup) ట్రోఫీని భారత్కు అప్పగించే అవకాశముందని బీసీసీఐ (BCCI) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్పై టీమ్ఇండియా (Team India) విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు నెలరోజులు గడుస్తున్నా.. ఇంకా ట్రోఫీ, మెడల్స్ను అందించకపోవడంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్ 4న ఐసీసీ త్రైమాసిక సమావేశం జరగనుంది. ఈలోగా నఖ్వీ.. ఆ ట్రోఫీని భారత్కు అప్పగించాలని, లేకపోతే ఈ విషయాన్ని ఐసీసీ (ICC) దృష్టికి తీసుకువెళతామని ఆయన హెచ్చరించారు.
‘దాదాపు నెల గడుస్తున్నా.. ఇప్పటికీ ఆసియా ట్రోఫీని మాకు అందించలేదు. ఇది సరికాదు’ అని సైకియా ఓ న్యూస్ ఏజెన్సీతో అన్నారు. అలాగే ట్రోఫీ విషయమై ఏసీసీకి లేఖ పంపిన విషయాన్నీ ధ్రువీకరించారు. అయితే దానికి బదులుగా నఖ్వీ.. ఏసీసీ కార్యాలయంలోనే ట్రోఫీని తీసుకోవాలని బదులిచ్చినట్లు తెలిపారు. ‘మేం ఏసీసీ ఛైర్మన్కు ఆసియా కప్ ట్రోఫీ విషయమై లేఖ పంపాం. అయినా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. ట్రోఫీ ఇప్పటికీ వారి స్వాధీనంలోనే ఉంది. ఒకట్రెండు రోజుల్లో తప్పకుండా అది ముంబయిలోని బీసీసీఐ కార్యాలయానికి వస్తుంది’ అని సైకియా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆసియా కప్లో భారత్ మొత్తంగా మూడుసార్లు పాకిస్థాన్తో తలపడితే, అన్ని మ్యాచ్లనూ టీమ్ఇండియా గెలిచింది. ఫైనల్లోనూ పాక్పై నెగ్గి ట్రోఫీని కైవసం చేసుకుంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు.. పాక్ క్రికెటర్లతో కరచాలనానికి ఆసక్తి చూపని విషయం తెలిసిందే. అలాగే పాకిస్థాన్కు చెందిన ఏసీసీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికీ ఇష్టపడలేదు. అయితే ఆ ట్రోఫీని మరొకరి చేతుల మీదుగా భారత జట్టుకు అందించకుండా.. నఖ్వీ పిల్ల చేష్టలకు పాల్పడ్డాడు. ట్రోఫీ, మెడల్స్ను మైదానం నుంచి తనతోపాటు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాటిని ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు అందించకుండా నఖ్వీ.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్ముఖ్.. చెస్ ప్రపంచకప్లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. - 
                                    
                                        

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
ప్రపంచ మహిళల వన్డే వరల్డ్ కప్ను టీమ్ఇండియా (Team India) కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై చర్చ నడుస్తోంది. - 
                                    
                                        

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
నవీముంబయి స్టేడియంలో వెలుగులు విరజిమ్మే దీపకాంతుల మధ్య.. భారత మహిళల జట్టు (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరు క్యాచ్ అందుకుంది. దీంతో టీమ్ఇండియా చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


