Achinta Sheuli: ఆ అన్న త్యాగం.. తమ్ముడి మెడలో పసిడై మెరిసింది..!
కోల్కతాకు వందకిలోమీటర్ల దూరంలో ఉన్న దేవుల్పురి అనే చిన్న గ్రామం అది. ఆ ఊర్లోని వందలాది కళ్లు నిన్న అర్ధరాత్రి అయినా నిద్రపోకుండా టీవీలకు అతుక్కుపోయాయి. కొన్ని వందల మైళ్ల దూరంలో తమ
ఇంటర్నెట్ డెస్క్: కోల్కతాకు వందకిలోమీటర్ల దూరంలో ఉన్న దేవుల్పురి అనే చిన్న గ్రామం అది. ఆ ఊర్లోని వందలాది కళ్లు నిన్న అర్ధరాత్రి అయినా నిద్రపోకుండా టీవీలకు అతుక్కుపోయాయి. కొన్ని వందల మైళ్ల దూరంలో తమ ఊరివాడైన అచింత షూలి ప్రపంచ వేదికపై పతకం కోసం పోటీ పడుతున్నాడప్పుడు. అతడు సాధిస్తాడని వారికి నమ్మకమున్నా.. ఏ క్షణాన ఏమవుతుందోనన్న ఆందోళనతో ఊపిరిబిగపట్టి టీవీలు చూశారు. వారి నమ్మకం వృథా కాలేదు. 20ఏళ్ల అచింత షూలి ఏకంగా స్వర్ణ పతకం నెగ్గి దేవుల్పురి సిగలో అలంకరించాడు. అయితే ఈ విజయం వెనుక అతడి కఠోర శ్రమతో పాటు కష్టాల ప్రయాణముంది. అన్నింటికంటే మించి ఓ అన్న త్యాగం.. నేడు ఈ తమ్ముడి మెడలో పసిడై మురిసింది.
అన్నను చూసి వెయిట్లిఫ్టింగ్లోకి..
పశ్చిమ బెంగాల్లోని హవ్డా జిల్లా దేవుల్పురి గ్రామానికి చెందిన అచింత షూలిది పేద కుటుంబం. తండ్రి వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అచింత అన్న అలోక్కు చిన్నప్పటి నుంచి బరువులెత్తడం అంటే చాలా ఇష్టం. దాంతో అతడు వెయిట్లిఫ్టింగ్లో శిక్షణ తీసుకున్నాడు. అచింత ఎప్పుడూ అన్న వెంటే ఉండేవాడు. వెయిట్లిఫ్టింగ్లో శిక్షణ కోసం అలోక్ వెళ్తే అతడూ వెళ్లేవాడు. అలా అన్నను చూసి స్ఫూర్తి పొందిన అచింత.. తాను కూడా ఈ రంగంలోకి రావాలనుకున్నాడు. అతడిని ఆసక్తిని గమనించిన స్థానిక కోచ్ అస్తానా దాస్ అచింతకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు.
తండ్రి అంత్యక్రియలకు డబ్బుల్లేక..
ఇలా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని కుదుపు. 2013లో అచింత తండ్రి అకస్మాత్తుగా మరణించారు. అన్నదమ్ములిద్దరూ చిన్నవారే. తల్లికి పెద్దగా లోకం తెలియదు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు కూడా లేకపోవడంతో అచింత బోరున ఏడ్వడం తనకిప్పటికీ గుర్తేనని అలోక్ చెబుతుంటారు. తండ్రి మరణంతో రోజు గడవడం భారమైంది. కుటుంబాన్ని పోషించడం కోసం ఇంటర్ చదువుతున్న అలోక్ చదువు మానేసి చిన్న కూలి పనిలో చేరాడు. ఈ పరిస్థితుల్లో ఇద్దరికీ వెయిట్లిఫ్టింగ్లో శిక్షణ అంటే ఖర్చుతో కూడుకున్న పని. దీంతో అలోక్ తన కలను పక్కనబెట్టాడు. కానీ, తన కలను తమ్ముడి ద్వారా నెరవేర్చుకోవాలని భారమైనా సరే అచింతకు వెయిట్లిఫ్టింగ్లో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాడు.
ఆర్మీ ఇనిస్టిట్యూట్.. జీవితాన్ని మార్చేసింది..
తండ్రి మరణాన్ని గుండెల్లో దిగమింగుకుని 2013లో అచింత జూనియర్ స్థాయి జాతీయ ఛాంపియన్షిప్స్ పోటీల్లో పాల్గొన్నాడు. అయితే ఆ పోటీల్లో అచింత నాల్గో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సరైన డైట్ తీసుకోవడానికి సాధ్యపడలేదు. దీంతో 2014లో అచింత ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్కు దరఖాస్తు చేసుకున్నాడు. జాతీయ ఛాంపియన్షిప్స్లో అతడి ప్రదర్శనను గుర్తించిన ఆర్మీ ఇనిస్టిట్యూట్ కోచ్లు అతడిని ఎంపిక చేశారు. 2015లో నేషనల్ క్యాంప్ నుంచి అచింతకు పిలుపొచ్చింది. అక్కడ శిక్షణ తీసుకుని యూత్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో రజతం సాధించాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు మళ్లీ ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్లో కొనసాగాడు.
2018 నుంచి నేషనల్ క్యాంప్లో ఉంటున్న అచింత.. అదే ఏడాది జరిగిన ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచాడు. 2019లో జూనియర్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో పతకం సాధించాడు. 2021లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో రజతం నెగ్గాడు. 2020 ఒలింపిక్ క్వాలిఫికేషన్ రౌండ్లో 0.02 పాయింట్ల తేడాతో ఒలింపిక్స్కు దూరమయ్యాడు. అయితేనేం.. ఇప్పుడు జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో ఏకంగా స్వర్ణం సాధించి దేశం గర్వపడేలా చేశాడు. అన్న అలోక్ వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని అచింత గర్వంగా చెబుతున్నాడు. అందుకే ఈ పతకాన్ని కూడా అన్నకే అంకితమిచ్చాడు..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత