Cricket in Olympics: ఒలింపిక్స్లో క్రికెట్ వచ్చేసింది... ఇక సందడే సందడి!
ప్రపంచంలో ఆదరణ ఉన్న రెండో అతి పెద్ద క్రీడగా నిలిచిన క్రికెట్ను ఒలింపిక్స్ ఈవెంట్లో చేరుస్తూ ఐవోసీ నిర్ణయం తీసుకుంది. 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్లో టీ20 టోర్నీ నిర్వహించనున్నారు.
నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ (Olympics) అంటే అభిమానుల్లో అంచనాలు.. ఆసక్తి పతక స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా భారత అథ్లెట్లు బరిలో దిగుతున్నప్పుడు ఫ్యాన్స్ కళ్లన్నీ వారిపైనే. అలాంటిది ఈ క్రీడల్లో క్రికెట్ (Cricket)ను చేరిస్తే!! వినడానికే చాలా థ్రిల్లింగా ఉంది కదా! 2028 లాస్ఏంజిలెస్ ఒలింపిక్స్ (2028 Los Angeles Olympics)లో ఇది నిజం కాబోతోంది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2028 ఈవెంట్లో టీ20 టోర్నీ నిర్వహించనున్నారు.
క్రికెట్.. ఎంతో పురాతనమైన ఆట.. మరెంతో ప్రాచుర్యంలో ఉన్న క్రీడ. కేవలం టెస్టులాడే పది దేశాల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న గేమ్ ఇది. దీనిని ఒలింపిక్స్లో చేర్చడం అంటే... క్రికెట్ ప్రేమికులకు పెద్ద శుభవార్తే. ఇన్నాళ్లూ ఒలిపింక్స్లో క్రికెట్ను ఎందుకు చేర్చలేదా? అని మదనపడుతున్న అభిమానులు.. తాజా వార్తతో ఉబ్బితబ్బిబవుతున్నారు.
ఎంత క్రేజ్ ఉన్నా..
క్రికెట్ అంటే ఉర్రూతలూగిపోతారు చాలా దేశాల్లోని అభిమానులు. ముఖ్యంగా ఆసియా ఖండ దేశాల్లో క్రికెట్ను ఓ మతంగానే భావిస్తారు. అమెరికాతో పాటు యూరోప్లోని చాలా దేశాల్లో క్రికెట్ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫుట్బాల్ను మాత్రమే చూసిన అక్కడి అభిమానులు ఇప్పుడు క్రికెట్ వైపు కన్నేస్తున్నారు. ఇక బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికాల్లో క్రికెట్కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఫుట్బాల్, టెన్నిస్నే ఎక్కువగా ఆదరించే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, చిలీ, పోర్చుగల్ లాంటి ఐరోపా దేశాల్లో ఇప్పుడు క్రికెట్ సీరియస్ క్రీడగా మారింది. ఏదో సరదాగా ఆడడం కాదు. క్వాలిఫయింగ్ టోర్నీల్లోనూ ఆయా దేశాల జట్లు ఆడుతున్నాయి. దీంతో ప్రపంచంలో ఆదరణ ఉన్న రెండో అతి పెద్ద క్రీడగా క్రికెట్ నిలిచింది.
కానీ ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్లో గత వందేళ్లలో క్రికెట్కు ఒక్కసారి మాత్రమే స్థానం దక్కడం ఆశ్చర్యం. ఒలింపిక్స్ ముంగిట ప్రతిసారీ ప్రతిపాదనలు చేయడం అక్కడితోనే ఆగిపోవడం జరుగుతుంది. చివరగా 1900 పారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ను ఆడారు. అంటే 128 ఏళ్ల క్రితం. ఆ తర్వాతి నుంచి ఈ ఆటను పక్కనపెట్టేశారు. కానీ లాస్ఏంజిల్స్లో జరిగే 2028 ఒలింపిక్స్లో క్రికెట్ మళ్లీ పునరాగమనం చేయడానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకి ఉన్న క్రేజ్ని గుర్తించిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC) క్రికెట్ ఆటను ఈ క్రీడల్లో చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
ఆసియా క్రీడలే తొలి అడుగు
ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా హాంగ్జౌలో క్రికెట్ను నిర్వహించారు. పురుషులు, మహిళలకు టీ20 ఫార్మాట్లో పోటీలు పెట్టారు. ఒలింపిక్స్ తర్వాత అంతటి పెద్ద ఈవెంట్ అయిన ఆసియా క్రీడల్లో క్రికెట్ను చేర్చడంతో ఒలింపిక్స్లోనూ ఈ ఆటను ఆడించేందుకు మార్గం సుగమమైంది. కామన్వెల్త్ క్రీడల్లోనే గతంలో పురుషుల క్రికెట్ ఆడించారు. గతేడాది జరిగిన క్రీడల్లో మహిళలకు కూడా పోటీలు పెట్టారు. క్రికెట్ అనగానే సుదీర్ఘమైన ఆట.. చాలారోజులు నిర్వహించాలి.. మైదానాలను సిద్ధం చేయాలి అనే భావన ఉంది. దీంతో ఐరోపా దేశాలు దీనిపై పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతో ఒలిపింక్స్లో ఈ ఆటను ఇన్నాళ్లూ పరిగణనలోకి తీసుకోలేదు. కానీ విపరీతమైన జనాదరణ ఉన్న క్రికెట్ను 2028 క్రీడల్లో చేరిస్తే ఈ క్రీడల విలువ ఎన్నో రెట్లు పెరుగుతుందని నిర్వాహకులు ఎట్టకేలకు నమ్మారు.
ప్రసార హక్కులకు రెక్కలు
ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడం ద్వారా భారత్లో ప్రసార హక్కుల నుంచి భారీగా సొమ్ము రాబట్టాలని కూడా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ భావించినట్లు సమాచారం. ప్రస్తుతం ఒలింపిక్స్ ప్రసార హక్కుల వేలం ద్వారా రూ.158 కోట్ల వరకు ఐవోసీ ఆర్జిస్తోంది. అయితే క్రికెట్ను ఒలింపిక్స్లో చేర్చడంతో ప్రసార హక్కుల విలువ భారీగా పెరిగిపోనుంది. సుమారు రూ.15 వేల కోట్లు కేవలం ప్రసార హక్కుల ద్వారానే ఐవోసీకి లభించనున్నాయని అంచనా. దీన్ని బట్టే క్రికెట్ విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ప్రసార హక్కులే కాదు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో అభిమానుల వీక్షణ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఈ సమీకరణాలన్నిటిని పరిగణనలోకి తీసుకునే క్రికెట్ను ఒలింపిక్స్ చేర్చిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్