Dhoni and Jadeja: ధోనీతో నీ బంధం సూపర్ ‘సర్’..!
జడేజా రేసుగుర్రం లాంటోడు.. దూకుడెక్కువ.. మరోవైపు మిన్ను విరిగి మీదపడినా చలించని తత్వం ధోనీది. భారతీయ క్రికెట్లో వీరిద్దరి అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఎన్ని వివాదాలు వచ్చినా జడ్డూను మహేంద్రుడు వెనుకేసుకొచ్చాడు. ధోని కోసం ఎంత కఠిన పోరాటమైనా చేసేందుకు రవీంద్రుడు వెనుకాడలేదు.
ఇంటర్నెట్డెస్క్: ధోనీ ఓ భావోద్వేగం.. ఇది ఐపీఎల్ తన ట్విటర్ హ్యాండిల్లో ఈ నెల 27వ తేదీన చేసిన ఓ పోస్టు సారాశం. నిజమే.. భారత క్రికెట్లో ప్రతిభను గుర్తించి చేరదీయడం.. అటగాళ్లను ప్రోత్సహించడంలో ధోనీ శైలే వేరు. కోహ్లీ, రోహిత్లు అతడి నీడన ఎదిగామని చెప్పేందుకు ఏమాత్రం సంకోచించరు. ఇక జడేజా అయితే తన కెరీర్ గురించి ఇటీవల చెబుతూ..‘‘నా క్రికెట్ ప్రయాణం ఇద్దరు మహేంద్రుల మధ్యలోనే జరిగింది’’ అని పేర్కొన్నాడు. వీరిలో ఒకరు కోచ్ మహేంద్ర సింగ్ చౌహాన్ కాగా.. మరొకరు ధోనీ..! జడేజా కెరీర్ను ఎంఎస్డీ అంతగా ప్రభావితం చేశాడు. జడ్డూ చిక్కుల్లో పడ్డ ప్రతి సారీ ధోనీ అతడికి ఏదో రకంగా అండగా ఉంటూ వచ్చాడు. తాజాగా అద్భుతమైన ఫోర్తో చెన్నైకి ఐపీఎల్ అందించిన అనంతరం జడ్డూ మాట్లాడుతూ.. ఈ కప్ను ధోనీకి అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. గతంలో 2011 ప్రపంచకప్ సమయంలో టీమ్ఇండియా లెజెండ్ సచిన్ కోసం కప్ సాధించామని యువరాజ్ సింగ్ చెప్పిన సన్నివేశాన్ని ఇది గుర్తుచేసింది.
‘సెయింట్ లూసియా ఘటన’ తర్వాత అండగా..
2009లో జడేజా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2010లో భారత్ టీ20 ప్రపంచకప్లో శ్రీలంక చేతిలో ఓడిపోయి.. టోర్ని నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి తర్వాత కొన్ని గంటల్లో ఆరుగురు భారత క్రికెటర్లతో కలిసి జడేజా శ్రీలంకలోని సెయింట్ లూసియా పబ్కు వెళ్లాడు. అక్కడ వారికి కొందరు అభిమానులతో గొడవ జరిగింది. ఈ విషయం వివాదాస్పదమైంది. దీంతో బీసీసీఐ నుంచి జడ్డూ షోకాజ్ నోటీస్ అందుకొన్నాడు. కెరీర్ ప్రారంభంలోనే ఇటువంటి ఘటనలో ఇరుక్కోవడం అతడికి ఇబ్బందికరంగా మారింది. అటువంటి పరిస్థితుల్లో ధోనీ నుంచి అతడికి పూర్తి మద్దతు లభించింది. ఒక క్షమాపణ లేఖతో వివాదం సద్దుమణిగేట్లు చూశాడు. నాటి బీసీసీఐ కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ సీఎస్కే యజమాని కావడం గమనార్హం.
ఐపీఎల్లో అండగా..
ఐపీఎల్ కెరీర్ ప్రారంభంలో జడ్డూ రాజస్థాన్ జట్టు తరపున ఆడాడు. అతడు 2010లో కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించడంతో ఐపీఎల్ నుంచి ఏడాది దూరంగా ఉండాల్సివచ్చింది. 2011లో కొచ్చి జట్టు అతడిని కొనుగోలు చేసింది... కానీ, అదే ఏడాది ఆ జట్టును ఐపీఎల్ నుంచి రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో జడేజా మళ్లీ వేలంకు వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే ధోనీ నేతృత్వంలో అంతర్జాతీయ జట్లలో ఆడుతున్న అతడిని సీఎస్కే భారీ మొత్తం చెల్లించి దక్కించుకొంది. ఈ క్రమంలో వేలంలో డెక్కన్ ఛార్జర్స్తో పోటీపడింది. నాటి నుంచి చెన్నైలోనే జడ్డూ ఐపీఎల్ ప్రస్థానం కొనసాగింది.
2022లో ధోనీ నుంచి నాయకత్వ బాధ్యతలు కూడా అందుకొన్నాడు. కెప్టెన్సీ వహించిన ఎనిమిది మ్యాచ్ల్లో వరుసగా నాలుగు ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా అతడి బ్యాటింగ్ కూడా దెబ్బతింది. పక్కటెముకల గాయం కారణమని చెబుతూ జడేజా టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో 9వ మ్యాచ్ నాటికి మహీ మరోసారి కెప్టెన్సీ భారం తలకెత్తుకొన్నాడు. కానీ, సీఎస్కే పరిస్థితి మారలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు జడేజా.. సీఎస్కే సోషల్ మీడియా ఖాతాను అన్ఫాలో చేశాడు. ఎల్లో జెర్సీతో ఉన్న ఫొటోలను కూడా డిలీట్ చేశాడు. దీంతో ధోనీ-జడ్డూ మధ్య బంధం బీటలు వారిందని భారీగా ప్రచారం జరిగింది. అప్పటికే సీఎస్కే యాజమాన్యంతో పొసగక సురేష్ రైనా కూడా జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో జడ్డూ కూడా అదే బాట పడతాడని ఫ్యాన్స్ అనుకొన్నారు. కానీ, ఆశ్చర్యకరంగా 2022 నవంబర్లో తాను చెన్నైకి ఆడుతున్నట్లు జడేజా ట్విటర్లో ప్రకటించాడు. దీంతోపాటు ధోనీకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్న ఫొటోను షేర్ చేశాడు.
‘సర్’ బిరుదు వెనుక ధోనీ..!
అభిమానులు జడ్డూ పేరుకు ముందు ‘సర్’ అని గౌరవ వాచకాన్ని తగిలిస్తారు. తొలిసారి స్వయంగా ధోనీనే జడ్డూకు ఈ బిరుదును ఇచ్చాడు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన ఘటన ఉంది. 2013లో ఐపీఎల్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే జట్టు విజయం కోసం ఒక్క బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ఉన్న జడ్డూ ఆర్సీబీ బౌలర్ ఆర్పీ సింగ్ వేసిన షార్ట్పిచ్ వైడ్ బంతిని కొట్టి పరుగు తీశాడు. కానీ, థర్డ్మ్యాన్ పొజిషన్లోని ఫీల్డర్ రామ్పాల్ క్యాచ్ అందుకొన్నాడు. వికెట్ దక్కిందని కోహ్లీ సంబరాలు మొదలుపెట్టాడు. అంతలోనే అంపైర్ ఆ బంతిని నోబాల్గా ప్రకటించాడు. నోబాల్ (1) + ఒక పరుగు తీయడంతో సీఎస్కే ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ సందర్భంగా జడేజాను పొగడ్తలతో ముంచెత్తుతూ ధోనీ వరుసగా ట్వీట్లు చేశాడు. ‘‘మీరు సర్ జడేజాను ఒక బంతికి రెండు పరుగులు చేయమంటే.. అతడు ఒక బంతి మిగిలి ఉండగానే గెలిపిస్తాడు’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. రజనీ సర్ (రజనీకాంత్) ఎప్పుడైనా ‘సర్ జడేజా’ బౌలింగ్ను ఎదుర్కోవాల్సి వస్తే.. ఆ సమరాన్ని ‘క్లాష్ ఆఫ్ టైటాన్స్’ అని పిలుస్తారు’’ అని మరో ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ‘సర్ రవీంద్ర జడేజా’గా పేరు పాపులర్ అయింది.
టీకప్పులో తుపాను..
2023 ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్లో ధోనీ-జడేజా మధ్య మైదానంలో వాగ్వాదం జరిగింది. అంతకు ముందు రోజే జడ్డూ ‘కర్మ’ ట్వీట్ను పోస్టు చేశాడు. మరోవైపు జడ్డూ భార్య రివాబా కూడా ‘నీ సొంత మార్గంలో వెళ్లు’ అంటూ ఆ పోస్టుపై కామెంట్ చేసింది. ఈ పరిణామాలు అభిమానుల్లో అనుమానాలు పెంచాయి. ఆ తర్వాత కూడా తొలి క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్వయంగా మైదానం వద్దకు వచ్చి జడ్డూతో ఏదో మాట్లాడి ప్రోత్సహించి వెళ్లాడు. మళ్లీ 2022 పరిస్థితి పునరావృతం అవుతోందా..? అని అభిమానులు ఆందోళన చెందారు. కానీ, ఇవన్నీ కేవలం ఊహాగానాలే అని జడ్డూ ఫైనల్లో తేల్చేశాడు. కష్టకాలంలో గిల్ను జడ్డూ అవుట్ చేయడంతో పాటు చివరి ఓవర్లో సాహసోపేతమైన షాట్లతో చెన్నైకు ఐదోసారి ఐపీఎల్ కప్ అందించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన ధోనీ.. జడ్డూను ఏకంగా గాల్లోకి ఎత్తేశాడు. ఈ కప్ను ధోనీకి అంకితం చేస్తున్నామని జడ్డూ పోస్ట్మ్యాచ్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్లో ఐపీఎల్ ట్రోఫీని జడ్డూ భార్యా రివాబా ఒడిలో పెట్టి మరీ ఫొటో దిగాడు. అదీ ధోనీ-జడ్డూ బంధం. ఈ బంధానికి గుర్తుగా జడ్డూ ఇన్స్టాలో ‘ధోనీ-జడ్డూ మూమెంట్’ ప్రొఫైల్పిక్గా వెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?