MS Dhoni: ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు.
చెన్నై: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) చివరి బంతుల్లో చేసే మాయ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతడి విన్నింగ్ షాట్స్ క్రికెట్కు కొత్త వన్నె తీసుకొచ్చాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాలుగు పదుల వయసులోనూ అదే ఆటతీరును కొనసాగిస్తున్నాడు. తాజా ఐపీఎల్ (IPL) సీజన్లోనూ వీలు కుదిరినప్పుడల్లా సొగసైన బౌండరీలు బాదుతున్నాడు. బుధవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లోనూ అదే పునరావృతమైంది.
పంజాబ్ కింగ్స్ బుధవారం 7 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదట చెన్నై బ్యాటుతో తడబడింది. ధోనీ (MS Dhoni) చివరి రెండు ఓవర్లు మిగిలి ఉండగా క్రీజులోకి వచ్చాడు. 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో అర్ష్దీప్ వేసిన ఐదో బంతిని భారీ సిక్స్గా మలిచి అభిమానులను కేరింతలు పెట్టించాడు. ఐపీఎల్లో చివరి ఓవర్లో ఇది ధోనీకి 66వ సిక్స్. ఫైనల్ ఓవర్లో అత్యధిక సిక్స్లు బాదిన రికార్డు ఇప్పటి వరకు అతడి పేరు మీదే ఉంది. ఇప్పుడు అది మరింత పదిలమైంది. 33 సిక్సులతో పోలార్డ్ రెండో స్థానంలో కొనసాగుతూ ధోనీని అందుకోలేనంత దూరంలో ఉన్నాడు.
ధోనీకి ఇది తొలి ఔట్..
ఈ ఐపీఎల్ సీజన్లో ధోనీ (MS Dhoni) తొలిసారి ఔటయ్యాడు. బుధవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్కు ముందు వరకు అతడు ఒక్కసారి కూడా వికెట్ కోల్పోలేదు. బుధవారం కూడా అదే కొనసాగుతుందని ఊహించినప్పటికీ.. అనుకోకుండా చివరి బంతికి రనౌటయ్యాడు. అర్ష్దీప్ వేసిన ఇన్నింగ్స్ ఫైనల్ బాల్ను ధోనీ థర్డ్ మ్యాన్ దిశగా మలిచాడు. ఆ పొజిషన్లో ఉన్న హర్షల్ పటేల్ బంతిని వదిలేయడంతో ధోనీ రెండో పరుగుకు ప్రయత్నించాడు. కానీ, పటేల్ వెంటనే కోలుకొని బంతిని విసరడంతో బ్యాటర్ వైపు ఉన్న జితేశ్ వికెట్లను గిరాటేశాడు. ధోనీ కనీసం అంపైర్ వైపు కూడా చూడకుండా పెవిలియన్కు వెళ్లిపోయాడు. పంజాబ్తో మ్యాచ్కు ముందు వరకు ధోనీ 7 మ్యాచుల్లో నాటౌట్గా నిలిచి 260 స్ట్రైక్రేట్తో 96 పరుగులు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
ఈసారి ఐపీఎల్ సీజన్లో చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా ధోనీ కోసమే వస్తున్నారా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మైదానంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ధోనీ నామస్మరణతో మారు మోగిపోతోంది. -
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
ఉప్పల్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. గుజరాత్తో హైదరాబాద్ ఢీకొట్టనుంది. -
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Saeed Anwar: మహిళలు ఉద్యోగాలు చేయడం వల్లే విడాకులు పెరుగుతున్నాయంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అన్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. -
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్. -
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి ముగింపు పలికాడు. ఈ మేరకు కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. -
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అంటేనే హాట్ కేక్. కానీ, భారత మాజీ క్రికెటర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదని వార్తలు రావడం గమనార్హం. -
నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. -
చెన్నై, బెంగళూరు మధ్యలో వరుణ్!
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్లేఆఫ్స్పై సన్రైజర్స్ గురి
బాదుడు మంత్రంతో.. దూకుడు ఆయుధంతో ఐపీఎల్-17వ సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. -
రాజస్థాన్ మళ్లీ..
ప్చ్.. రాజస్థాన్! ప్లేఆఫ్స్లో స్థానం ఖరారైనా.. కీలక సమరాలకు ముందు పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. -
నీరజ్దే పసిడి
మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. -
భారత్ను పాక్ ఓడించడం కష్టమే
టీ20 ప్రపంచకప్లో భారత్ను పాకిస్థాన్ ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. -
సాత్విక్ ద్వయం శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్- చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. -
లామిచానె జైలుశిక్ష రద్దు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెకు భారీ ఊరట. -
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
-
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
-
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యం!
-
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
-
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్