Team India: విరాట్ కెప్టెన్సీ వదిలేశాక.. టెస్టుల్లో భారత్కు గొప్ప విజయాలు లేవు: సల్మాన్ భట్
గత పదేళ్లుగా భారత్ (Team India) ఖాతాలో ఐసీసీ టైటిల్ లేదు. వరుసగా రెండు సీజన్లలో డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లినప్పటికీ టెస్టు ‘గద’ను మాత్రం దక్కించుకోలేకపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final 2023) ఫైనల్లో ఓటమితో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు రేగాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ను జూన్లోనే ఎందుకు పెడతారు..? ఇంగ్లాండ్ నుంచి మరో చోటుకు మార్చాలని రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే రోహిత్ వ్యాఖ్యలను కొట్టిపడేస్తూ పాక్మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తర్వాత భారత టెస్టు క్రికెట్ క్రమంగా దిగజారుతోందని వ్యాఖ్యానించాడు. సరైన సన్నద్ధత లేకుండా ఇంగ్లాండ్కు వెళ్లడమే భారత్ ఓటమికి కారణమని భట్ విశ్లేషించాడు. విరాట్ తర్వాత రోహిత్ జట్టు పగ్గాలను అందుకున్న విషయం తెలిసిందే.
‘‘టెస్టు మ్యాచ్ ముగిశాక.. జూన్లో ఎందుకు పెడతారు? ఇంగ్లాండ్లోనే ఎందుకు ఆడిస్తారు? అని అడిగాడు. మనకు అనుకూలంగా ఫలితాలు రానప్పుడే ఇలాంటి చర్చ బయటకు వస్తుంది. అలా కాకుండా, మన ప్రాధాన్యత గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ భారత్కు డబ్ల్యూటీసీ ఫైనల్ ముఖ్యమని భావిస్తే.. ఐపీఎల్ను 20 రోజుల ముందే పూర్తి చేసుకుని ఇంగ్లాండ్కు రావాల్సింది. కనీసం 15 రోజుల ముందైనా జట్టును ఇంగ్లాండ్కు పంపించి ఉంటే బాగుండేది. కౌంటీ జట్లతో వార్మప్ మ్యాచ్లను ఆడి ఉండాల్సింది. ఎంఎస్ ధోనీ నుంచి జట్టు పగ్గాలను అందుకున్న విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. విదేశాల్లో రికార్డులు కొట్టింది. విరాట్ జట్టులో లేకపోయినా విజయాలను నమోదు చేసిన సందర్భాలను చూశాం. ఎప్పుడైతే విరాట్ కెప్టెన్సీ నుంచి దిగిపోయాడో.. నిలకడగా ఫలితాలను సాధించలేకపోతోంది’’ అని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. విరాట్ తర్వాత టెస్టు జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించిన రోహిత్.. స్వదేశంలో ఆసీస్పై భారత్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీని గెలిచింది. కానీ, విదేశాల్లో విజయాలు నమోదు చేయడంలో తడబాటుకు గురైంది. అదే విరాట్ నాయకత్వంలో ఆసీస్, ఇంగ్లాండ్ గడ్డపైనే గెలిచి టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది.
విరాట్ మరో ఆసక్తికర ‘ఇన్స్టా స్టోరీ’
విరాట్ కోహ్లీ తరచూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కొటేషన్స్ పెడుతూ ఉండటం తెలిసిందే. తాజాగా మరో ఇన్స్టా స్టోరీస్తో విరాట్ ముందుకొచ్చాడు. ‘‘మార్పులను అందిపుచ్చుకోవాలంటే మనం కూడా అదే మార్గంలోకి వెళ్లాలి. అప్పుడే కలిసిపోయి ముందుకు సాగగలం’’ అంటూ ఇన్స్టా స్టోరీస్ పెట్టాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల కోహ్లీపై సానుకూల దృక్పథంతో కామెంట్లు చేస్తున్నాడు. దీంతో గంగూలీ వ్యాఖ్యలపైనే విరాట్ ఇలా స్పందించి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాల్లేవు: సూర్యనారాయణ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
-
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం