Team India: ఇలా గెలుస్తుంటే ఏదో కంగారు.. టీమ్ఇండియా ప్రదర్శనతో సంతోషమే.. అయినా భయమే
ఏదైనా మ్యాచ్ పోయినా పర్వాలేదనో, లేదంటే ఫలానా మ్యాచ్ ఓడిపోతే బాగుంటుందనో మన అభిమానులు అనుకోవడం ఎప్పుడైనా చూశామా? కానీ ఈ ప్రపంచకప్లో అదే భావన కలుగుతోంది.
ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత్ ఆడుతుంటే.. ఏదైనా మ్యాచ్ పోయినా పర్వాలేదనో, లేదంటే ఫలానా మ్యాచ్ ఓడిపోతే బాగుంటుందనో మన అభిమానులు అనుకోవడం ఎప్పుడైనా చూశామా? కానీ ఈ ప్రపంచకప్లో అదే భావన కలుగుతోంది. మ్యాచ్ మ్యాచ్కూ దుర్బేధ్యంగా మారుతూ.. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థినీ చిత్తుగా కొట్టేస్తుంటే.. లోలోన అభిమానుల్లో కంగారు పుడుతోంది. లీగ్ దశలో మరీ ఇంత ఆధిపత్యం చలాయించి.. ఏ సెమీస్లోనో, ఫైనల్లోనో ఎక్కడ మనవాళ్లు చేతులెత్తేస్తారో అనే భయం అభిమానులను వెంటాడుతోంది. ఆ దిశగా కొన్ని ప్రతికూల సెంటిమెంట్లు కూడా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఐతే వీటన్నింటినీ అధిగమించి ప్రపంచకప్ సాధించాలన్నది అభిమానుల ఆకాంక్ష.
సొంతగడ్డపై టీమ్ ఇండియా (Team India) ప్రపంచకప్ ఆడుతుంటే.. అంచనాలు ఎక్కువే ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ రోహిత్ సేన ఆ అంచనాలన్నింటినీ మించిపోయింది. మన జట్టు టోర్నీలో ఈ స్థాయిలో ఆధిపత్యం చలాయిస్తుందని.. ఎనిమిదికి ఎనిమిది మ్యాచ్ల్లోనూ గెలిచేస్తుందని.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి జట్లపై ఇంతటి ఘనవిజయాలు సాధిస్తుందని ఊహించి ఉండరు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేయడమే కాక.. ఇంకో మూడుసార్లు 350 పైచిలుకు స్కోర్లు సాధించిన దక్షిణాఫ్రికాపై ఏకంగా 243 పరుగుల తేడాతో నెగ్గడం, ఆ జట్టును కేవలం 83 పరుగులకే కుప్పకూల్చడం అనూహ్యం. నిజానికి ముందే సెమీస్ చేరడంతో ఈ మ్యాచ్లో ఓడినా పర్వాలేదన్న భావనలో ఉన్నారు అభిమానులు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడితే మనకు కలిసొస్తుందన్న ఆలోచన కూడా అభిమానుల్లో లేకపోలేదు. ఎందుకంటే 2011లో భారత్ సొంతగడ్డపై విజేతగా నిలిచినపుడు.. టోర్నీ మొత్తంలో ధోనీసేన ఓడింది ఒక్క దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే. ఆ సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా దక్షిణాఫ్రికా చేతిలో ఓడితే కప్పు మన సొంతమవుతుందేమో అని మ్యాచ్కు ముందు సామాజిక మాధ్యమాల్లో చర్చ జరగడం విశేషం. కానీ మన జట్టు అలాంటి సెంటిమెంట్లేమీ పెట్టుకోకుండా సఫారీ జట్టును చిత్తు చేసింది.
అయినా భరోసానే..
2011లో ఛాంపియన్ అయ్యాక గత రెండు వన్డే ప్రపంచకప్ల్లోనూ భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్.. ఆ రెండుసార్లూ గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించడం గమనార్హం. 2015లో 12 జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి లీగ్ దశలో తలపడగా.. గ్రూప్-బిలో ఆరుకు ఆరు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత్ అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. కానీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక 2019లో ప్రస్తుత ఫార్మాట్లో మాదిరే పది జట్లూ మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్లో తలపడ్డాయి. భారత్ 7 విజయాలతో అప్పుడు కూడా అగ్రస్థానం సాధించింది. కానీ ఆ టోర్నీలోనూ సెమీస్లోనే మన జట్టు ప్రయాణం ముగిసింది. అప్పుడు న్యూజిలాండ్.. టీమ్ఇండియాకు చెక్ పెట్టింది. ఇప్పుడు వరుసగా మూడో ప్రపంచకప్లోనూ భారత్ గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించడం అభిమానులను కొంచెం కంగారు పెట్టిస్తోంది. కాకపోతే ఈసారి ఆడుతోంది సొంతగడ్డపై. పైగా మన జట్టు ఫామ్ మామూలుగా లేదు. గత రెండు ప్రపంచకప్పుల్లో మన జట్టు గ్రూప్ దశలో అదరగొడుతున్నప్పటికీ.. జట్టులో కొన్ని లోపాలు కనిపించాయి. కూర్పు పరంగా ఇబ్బందులున్నాయి. ఇప్పటి స్థాయిలో బౌలింగ్ భీకరంగా లేదు. ఎక్కువగా బ్యాటింగ్ మీదే ఆధారపడేది. కానీ ఇప్పుడు జట్టులో అందరూ నిలకడగా రాణిస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం జట్టు ముందుకు సాగుతోంది. బలాబలాల్లో ఏ జట్టూ రోహిత్ సేన ముందు నిలిచేలా కనిపించడం లేదు. కాబట్టి ప్రతికూల సెంటిమెంట్లన్నింటినీ పక్కకు నెట్టి.. సెమీస్, ఫైనల్లోనూ జట్టు ఇదే ఆటతీరుతో జయకేతనం ఎగురవేసి దేశానికి మూడో కప్పు అందిస్తుందని ఆశిద్దాం.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?