Team India: ఇలా గెలుస్తుంటే ఏదో కంగారు.. టీమ్ఇండియా ప్రదర్శనతో సంతోషమే.. అయినా భయమే
ఏదైనా మ్యాచ్ పోయినా పర్వాలేదనో, లేదంటే ఫలానా మ్యాచ్ ఓడిపోతే బాగుంటుందనో మన అభిమానులు అనుకోవడం ఎప్పుడైనా చూశామా? కానీ ఈ ప్రపంచకప్లో అదే భావన కలుగుతోంది.
ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత్ ఆడుతుంటే.. ఏదైనా మ్యాచ్ పోయినా పర్వాలేదనో, లేదంటే ఫలానా మ్యాచ్ ఓడిపోతే బాగుంటుందనో మన అభిమానులు అనుకోవడం ఎప్పుడైనా చూశామా? కానీ ఈ ప్రపంచకప్లో అదే భావన కలుగుతోంది. మ్యాచ్ మ్యాచ్కూ దుర్బేధ్యంగా మారుతూ.. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థినీ చిత్తుగా కొట్టేస్తుంటే.. లోలోన అభిమానుల్లో కంగారు పుడుతోంది. లీగ్ దశలో మరీ ఇంత ఆధిపత్యం చలాయించి.. ఏ సెమీస్లోనో, ఫైనల్లోనో ఎక్కడ మనవాళ్లు చేతులెత్తేస్తారో అనే భయం అభిమానులను వెంటాడుతోంది. ఆ దిశగా కొన్ని ప్రతికూల సెంటిమెంట్లు కూడా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఐతే వీటన్నింటినీ అధిగమించి ప్రపంచకప్ సాధించాలన్నది అభిమానుల ఆకాంక్ష.
సొంతగడ్డపై టీమ్ ఇండియా (Team India) ప్రపంచకప్ ఆడుతుంటే.. అంచనాలు ఎక్కువే ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ రోహిత్ సేన ఆ అంచనాలన్నింటినీ మించిపోయింది. మన జట్టు టోర్నీలో ఈ స్థాయిలో ఆధిపత్యం చలాయిస్తుందని.. ఎనిమిదికి ఎనిమిది మ్యాచ్ల్లోనూ గెలిచేస్తుందని.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి జట్లపై ఇంతటి ఘనవిజయాలు సాధిస్తుందని ఊహించి ఉండరు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేయడమే కాక.. ఇంకో మూడుసార్లు 350 పైచిలుకు స్కోర్లు సాధించిన దక్షిణాఫ్రికాపై ఏకంగా 243 పరుగుల తేడాతో నెగ్గడం, ఆ జట్టును కేవలం 83 పరుగులకే కుప్పకూల్చడం అనూహ్యం. నిజానికి ముందే సెమీస్ చేరడంతో ఈ మ్యాచ్లో ఓడినా పర్వాలేదన్న భావనలో ఉన్నారు అభిమానులు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడితే మనకు కలిసొస్తుందన్న ఆలోచన కూడా అభిమానుల్లో లేకపోలేదు. ఎందుకంటే 2011లో భారత్ సొంతగడ్డపై విజేతగా నిలిచినపుడు.. టోర్నీ మొత్తంలో ధోనీసేన ఓడింది ఒక్క దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే. ఆ సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా దక్షిణాఫ్రికా చేతిలో ఓడితే కప్పు మన సొంతమవుతుందేమో అని మ్యాచ్కు ముందు సామాజిక మాధ్యమాల్లో చర్చ జరగడం విశేషం. కానీ మన జట్టు అలాంటి సెంటిమెంట్లేమీ పెట్టుకోకుండా సఫారీ జట్టును చిత్తు చేసింది.
అయినా భరోసానే..
2011లో ఛాంపియన్ అయ్యాక గత రెండు వన్డే ప్రపంచకప్ల్లోనూ భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్.. ఆ రెండుసార్లూ గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించడం గమనార్హం. 2015లో 12 జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి లీగ్ దశలో తలపడగా.. గ్రూప్-బిలో ఆరుకు ఆరు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత్ అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. కానీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక 2019లో ప్రస్తుత ఫార్మాట్లో మాదిరే పది జట్లూ మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్లో తలపడ్డాయి. భారత్ 7 విజయాలతో అప్పుడు కూడా అగ్రస్థానం సాధించింది. కానీ ఆ టోర్నీలోనూ సెమీస్లోనే మన జట్టు ప్రయాణం ముగిసింది. అప్పుడు న్యూజిలాండ్.. టీమ్ఇండియాకు చెక్ పెట్టింది. ఇప్పుడు వరుసగా మూడో ప్రపంచకప్లోనూ భారత్ గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించడం అభిమానులను కొంచెం కంగారు పెట్టిస్తోంది. కాకపోతే ఈసారి ఆడుతోంది సొంతగడ్డపై. పైగా మన జట్టు ఫామ్ మామూలుగా లేదు. గత రెండు ప్రపంచకప్పుల్లో మన జట్టు గ్రూప్ దశలో అదరగొడుతున్నప్పటికీ.. జట్టులో కొన్ని లోపాలు కనిపించాయి. కూర్పు పరంగా ఇబ్బందులున్నాయి. ఇప్పటి స్థాయిలో బౌలింగ్ భీకరంగా లేదు. ఎక్కువగా బ్యాటింగ్ మీదే ఆధారపడేది. కానీ ఇప్పుడు జట్టులో అందరూ నిలకడగా రాణిస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం జట్టు ముందుకు సాగుతోంది. బలాబలాల్లో ఏ జట్టూ రోహిత్ సేన ముందు నిలిచేలా కనిపించడం లేదు. కాబట్టి ప్రతికూల సెంటిమెంట్లన్నింటినీ పక్కకు నెట్టి.. సెమీస్, ఫైనల్లోనూ జట్టు ఇదే ఆటతీరుతో జయకేతనం ఎగురవేసి దేశానికి మూడో కప్పు అందిస్తుందని ఆశిద్దాం.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!