IND vs WI: ఏడేళ్ల తర్వాత పోయింది సిరీస్
ప్చ్ నిరాశే. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి పుంజుకున్నట్లే కనిపించిన టీమ్ఇండియా భంగపడింది. విండీస్తో చివరి టీ20లో ఓడి సిరీస్ను 2-3తో కోల్పోయింది.
చివరి టీ20లో భారత్ పరాజయం
3-2తో నెగ్గిన వెస్టిండీస్
మెరిసిన కింగ్, పూరన్
ప్చ్ నిరాశే. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి పుంజుకున్నట్లే కనిపించిన టీమ్ఇండియా భంగపడింది. విండీస్తో చివరి టీ20లో ఓడి సిరీస్ను 2-3తో కోల్పోయింది. గత మ్యాచ్లో పరుగుల వరద పారించిన అదే వేదికలో భారత్ తగినంత స్కోరు చేయలేకపోగా.. బ్రెండన్ కింగ్, పూరన్ మెరుపులతో కరీబియన్ జట్టు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ అర్ధశతకం వృథా అయింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో విండీస్ చేతిలో ఓడిపోవడం భారత్కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
లాడర్హిల్: బ్యాటింగ్లో దూకుడు కొరవడడంతో వెస్టిండీస్తో చివరిదైన అయిదో టీ20లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆదివారం మొదట భారత్ 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ (61; 45 బంతుల్లో 4×4, 3×6) టాప్ స్కోరర్. రొమారియో షెఫర్డ్ (4/31), అకీల్ హోసీన్ (2/24) భారత్ను కట్టడి చేశారు. బ్రెండన్ కింగ్ (85 నాటౌట్; 55 బంతుల్లో 5×4, 6×6), పూరన్ (47; 35 బంతుల్లో 1×4, 4×6) మెరవడంలో లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. హార్దిక్ పాండ్య సారథ్యంలో భారత్ టీ20 సిరీస్ను కోల్పోవడం ఇదే తొలిసారి. అతడి నేతృత్వంలో భారత్ ఇంతకుముందు నాలుగు సిరీస్లు గెలుచుకుంది.
అలవోకగా ఛేదించారు: వెస్టిండీస్ ఛేదనలో రెండో ఓవర్లోనే మేయర్స్ (10)ను అర్ష్దీప్ ఔట్ చేయడంతో భారత్ సంబరడిపోయింది. కానీ కింగ్కు తోడైన పూరన్.. ఆ ఆనందాన్ని ఎంతోసేపు నిలవనివ్వలేదు. తనదైన శైలిలో ధనాధనా బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అర్ష్దీప్ బౌలింగ్లో ఓ సిక్స్, హార్దిక్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు దంచేశాడు. మరోవైపు కింగ్ కూడా చెలరేగడంతో విండీస్ ఏడు ఓవర్లలో 71/1తో బలమైన స్థితిలో నిలిచింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ సాధికారిక బ్యాటింగ్ను కొనసాగించడంతో ఆతిథ్య జట్టు సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. ప్రతికూల వాతావరణం కారణంగా 12.3 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. అప్పటికి స్కోరు 117/1. 40 నిమిషాల విరామం తర్వాత ఆట తిరిగి ఆరంభమైంది. ఆ వెంటనే తిలక్ బౌలింగ్లో పూరన్ ఔటైనా విండీస్కు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. దూకుడు కొనసాగించిన కింగ్.. హోప్ (22 నాటౌట్)తో కలిసి విండీస్ను విజయతీరాలకు చేర్చాడు.
నిలిచిన సూర్య: అంతకుముందు టీమ్ఇండియాను వెస్టిండీస్ కట్టడి చేసింది. క్రమం తప్పకుండా వికెట్లు పడ్డా.. భారత్ గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది అంటే కారణం సూర్య కుమార్ కీలక ఇన్నింగ్సే. తిలక్ వర్మ (27; 18 బంతుల్లో 3×4, 2×6) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. గత మ్యాచ్ హీరోలు యశస్వి జైస్వాల్ (5), శుభ్మన్ గిల్ (9) భారీ అంచనాలతో బరిలోకి దిగారు. కానీ నిరాశపరిచారు. మూడు ఓవర్లలోపే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరిపోయారు. ఇద్దరినీ స్పిన్నర్ అకీల్ హోసీన్ వెనక్కి పంపాడు. తొలి ఓవర్లో జైస్వాల్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. మూడో ఓవర్లో గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. మూడు ఓవర్లలో 17కే రెండు వికెట్లు పడ్డా.. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ 51/2తో నిలిచింది. ఆత్మవిశ్వాసంతో ఆడిన సూర్య.. హోల్డర్ బౌలింగ్లో ఫోర్, హోసీన్ బౌలింగ్లో సిక్స్ దంచాడు. ఆకట్టుకునే ఆటను కొనసాగించిన తిలక్ మొదటి నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడాడు. జోసెఫ్ బౌలింగ్లో ఏకంగా మూడు ఫోర్లు, సిక్స్ దంచేశాడు. మోకాలిని వంచి స్వీప్తో డీప్ స్క్వేర్ లెగ్లోకి సిక్స్ కొట్టిన తీరును చూసి తీరాల్సిందే. ఆ తర్వాత హోల్డర్ బౌలింగ్లో కూడా సిక్స్ కొట్టాడు. కానీ తిలక్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మంచి ఊపుమీదున్న దశలో చేజ్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సంజు శాంసన్ (13) ఎక్కువసేపు నిలవలేదు. పేలవ ఫుట్వర్క్తో మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. హార్దిక్ పాండ్య (14; 18 బంతుల్లో 1×6) నిలిచినా క్రీజులో ఇబ్బందిగా కదిలాడు. ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో 7 పరుగులే చేయగలిగాడు. 11 నుంచి 16 ఓవర్ల మధ్య భారత్కు 37 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ ఓవర్లలో సూర్య కొట్టిన రెండు సిక్స్లు మినహా.. మరో బౌండరీ రాలేదు. 17వ ఓవర్లో హార్దిక్, ఆ తర్వాతి ఓవర్లో జట్టు స్కోరు 140 వద్ద సూర్య నిష్క్రమించడంతో ఇన్నింగ్స్కు భారత్ కోరుకున్నంత బలమైన ముగింపు ఇవ్వలేకపోయింది. మొత్తంగా చివరి నాలుగు ఓవర్లలో టీమ్ఇండియా అయిదు వికెట్లు చేజార్చుకుంది.
భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) అండ్ (బి) అకీల్ 5; గిల్ ఎల్బీ (బి) అకీల్ 9; సూర్యకుమార్ ఎల్బీ (బి) హోల్డర్ 61; తిలక్ (సి) అండ్ (బి) చేజ్ 27; శాంసన్ (సి) పూరన్ (బి) షెఫర్డ్ 13; హార్దిక్ (సి) హోల్డర్ (బి) షెఫర్డ్ 14; అక్షర్ (సి) షెఫర్డ్ (బి) హోల్డర్ 13; అర్ష్దీప్ (బి) షెఫర్డ్ 8; కుల్దీప్ ఎల్బీ (బి) షెఫర్డ్ 0; చాహల్ నాటౌట్ 0; ముకేశ్ నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-6, 2-17, 3-66, 4-87, 5-130, 6-140, 7-149, 8-149, 9-161; బౌలింగ్: అకీల్ 4-0-24-2; మేయర్స్ 1-0-4-0; హోల్డర్ 4-0-36-2; జోసెఫ్ 3-0-41-0; చేజ్ 4-0-25-1; షెఫర్డ్ 4-0-31-4
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ నాటౌట్ 85; మేయర్స్ (సి) యశస్వి (బి) అర్ష్దీప్ 10; పూరన్ (సి) హార్దిక్ (బి) తిలక్ 47; హోప్ నాటౌట్ 22; ఎక్స్ట్రాలు 7 మొత్తం: (18 ఓవర్లలో 2 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-12, 2-119; బౌలింగ్: హార్దిక్ 3-0-32-0; అర్ష్దీప్ 2-0-20-1; కుల్దీప్ 4-0-18-0; చాహల్ 4-0-51-0; ముకేశ్ 1-0-10-0; తిలక్ 2-0-17-1; అక్షర్ 1-0-8-0; యశస్వి 1-0-11-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
41 ఏళ్ల ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్తో తనకు బలమైన బంధం ఉందని గంభీర్ వెల్లడించాడు. ఏ నిర్ణయం తీసుకొన్నా జట్టు శ్రేయస్సు కోసమేనని అతడు నమ్ముతాడన్నాడు. -
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్లో చెన్నై మ్యాచ్లను చూసేందుకు వస్తున్నారు. అతడు కూడా వారిని నిరాశపర్చకుండా దూకుడుగా ఆడేస్తున్నాడు. -
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్
హార్దిక్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వస్తున్న క్రమంలో ముంబయి బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ సారథి అత్యుత్తమమని వ్యాఖ్యానించాడు. -
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
ఐపీఎల్ 17వ సీజన్లో వేటు ఎదుర్కొన్న తొలి ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నేరానికి పాల్పడటంతో సస్పెన్షన్ తప్పలేదు. -
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
మరో కీలక పోరులో ముంబయిని ఢీకొట్టేందుకు కోల్కతా సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి గౌతమ్ గంభీర్కు ప్రత్యేక విజ్ఞప్తి అందింది. -
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
ప్రస్తుత ఎడిషన్లో నాకౌట్ దశకు చేరుకొనే జట్టు ఏంటనేది ఇంకా తెలియలేదు. టాప్-4లోకి వస్తాయని అనుకుంటున్న జట్లకు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్లు షాక్లు ఇస్తున్నాయి. -
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
ఒక్క మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్పై ఫ్రాంచైజీ యజమాని అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ అనుభవం కేఎల్ రాహుల్కు ఎదురైంది. -
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
గెలిచామనే ఆనందం గుజరాత్కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
ఐపీఎల్కు రోహిత్ గుడ్బై చెప్పనున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలైంది. దీనంతటికి కేకేఆర్ పోస్టు చేసిన ఓ వీడియో కారణమైంది. -
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు