మాయగాడు
బంతిని అధీనంలోకి తెచ్చుకుంటాడు. ఎక్కడ పడాలో.. ఎటు తిరగాలో.. ఎక్కడికి వెళ్లాలో అని బంతిని నియంత్రిస్తాడు.
బంతిని అధీనంలోకి తెచ్చుకుంటాడు. ఎక్కడ పడాలో.. ఎటు తిరగాలో.. ఎక్కడికి వెళ్లాలో అని బంతిని నియంత్రిస్తాడు. బ్యాటర్ బుర్రను ముందే చదివేసి.. ఆశ్చర్యకర బౌలింగ్తో అబ్బురపరుస్తాడు. మణికట్టు మాయాజాలంతో మెప్పిస్తాడు. ఈ ఉపోద్ఘాతమంతా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ గురించే. ఇంగ్లాండ్తో సిరీస్లో నిలకడగా రాణిస్తున్న అతను చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో మరింత మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. అయిదు వికెట్లతో ఇంగ్లాండ్ నడ్డివిరిచాడు. ఈ వికెట్ల కంటే కూడా వీటిని సాధించిన తీరు కుల్దీప్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. పిచ్ స్పిన్కు విపరీతంగా సహకరించలేదు. కానీ కుల్దీప్ అవకాశాలను సృష్టించుకున్నాడు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో.. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో సాగిపోయాడు. లెగ్ స్పిన్తో ఓ బంతిని ఆఫ్స్టంప్కు దూరంగా తిప్పేస్తూ.. మరో బంతిని లోపలికి గురిపెడుతూ.. వైవిధ్యంతో బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. ముఖ్యంగా పోప్స్ స్టంపౌట్, క్రాలీ బౌల్డ్, స్టోక్స్ ఎల్బీ గురించి చెప్పుకోవాలి. బంతిని ముందుకు వచ్చి డిఫెండ్ చూద్దామని పోప్ ప్రయత్నించగా.. అది స్పిన్ అయి వికెట్కీపర్ చేతుల్లో పడింది. క్రాలీని బౌల్డ్ చేసిన బంతి గురించి.. ఇదే అత్యుత్తమ బంతి అంటూ పెద్ద చర్చే సాగుతోంది. ఆఫ్స్టంప్కు చాలా దూరంగా కుల్దీప్ బంతి పడింది. అది బయటకు వెళ్తుందని లేదా మహా అయితే కాస్త లోపలికి తిరుగుతుందని క్రాలీ అనుకున్నాడు. కానీ అనూహ్యగా తిరిగిన బంతి బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి వెళ్లి లెగ్స్టంప్కు అటువైపు తగిలింది. ఇక స్టోక్స్ను వరుసగా లెగ్స్పిన్ బంతులతో కుల్దీప్ పరీక్షించాడు. ఆ తర్వాత ఒక్కసారిగా లోపలికి బంతిని తిప్పి, గూగ్లీతో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ సిరీస్లో తొలి టెస్టులో ఆడని కుల్దీప్.. ఇప్పటివరకూ 17 వికెట్లు సాధించాడు. గత కొన్నేళ్లుగా కుల్దీప్ కెరీర్ ఒడుదొడుకులతో సాగింది. ఫామ్ కోల్పోవడం, మోకాలి శస్త్రచికిత్సతో వెనుకబడ్డాడు. దీంతో పాటు అశ్విన్, జడేజా, అక్షర్ ఉండటంతో జట్టులో చోటు దొరకలేదు. 2019 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి మధ్యలో రెండు టెస్టులే ఆడాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్లో విశాఖ టెస్టుతో పునరాగమనం చేసి నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ బజ్బాల్కు వన్డే తరహా బౌలింగ్తో చెక్ పెడుతున్నాడు. శస్త్రచికిత్స తర్వాత చేతి వేగాన్ని పెంచుకున్న కుల్దీప్ మరింత ప్రమాదకరంగా మారాడు. బరువు తగ్గడంతో ఫిట్నెస్ మెరుగై మరింత కచ్చితత్వం అందుకున్నాడు. 12వ టెస్టు ఆడుతున్న అతను 51 వికెట్లు సాధించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా టెస్టుల్లో 50 వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు.
భావోద్వేగాల మిళితం
ధర్మశాల టెస్టు ఆటగాళ్ల భావోద్వేగాలకు వేదికగా మారింది. అశ్విన్, బెయిర్స్టోకు ఇది వందో టెస్టు కావడమే కారణం. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా అశ్విన్కు బీసీసీఐ ప్రత్యేక టోపీని బహూకరించింది. ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతుండగా.. అశ్విన్ భావోద్వేగాలను నియంత్రించుకుంటూ కనిపించాడు. అనంతరం భార్య ప్రీతి, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అశ్విన్ మైదానంలో వచ్చేటప్పుడు సహచర ఆటగాళ్లు రెండు వైపులా నిలబడి చప్పట్లు కొట్టారు. మరోవైపు రూట్ నుంచి బెయిర్స్టో తన వందో టెస్టు టోపీని అందుకున్నాడు. అతని తల్లి, భార్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బెయిర్స్టో ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. వందో టెస్టు నేపథ్యంలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిశాక పెవిలియన్ చేరే క్రమంలో ముందు నడవాలని అశ్విన్కు కుల్దీప్ బంతిని విసిరాడు. కానీ కుల్దీప్ ఉత్తమంగా బౌలింగ్ చేశాడని అశ్విన్.. అతణ్నే ముందు నడవాల్సిందిగా బంతిని తిరిగి ఇచ్చాడు. అశ్విన్ వెళ్లాల్సిందిగా కుల్దీప్ కోరినా.. చివరకు కుల్దీప్నే ముందు నడిచేలా చేశాడు అశ్విన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద జోరు వాన..!
ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడానికి ఓవైపు హైదరాబాద్ జట్టు సిద్ధమవుతుంటే.. మరోవైపు వరుణుడు తన మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు. గుజరాత్తో నేడు జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్ను వరుణుడు పలకరించే అవకాశం ఉంది.
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. అయితే, పాండ్య ఎంపికపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
IPL PlayOffs: గుజరాత్తో జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? ప్లేఆఫ్స్ సమీకరణాలు ఎలా మారతాయి? -
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
ఈసారి ఐపీఎల్ సీజన్లో చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా ధోనీ కోసమే వస్తున్నారా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మైదానంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ధోనీ నామస్మరణతో మారు మోగిపోతోంది. -
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
ఉప్పల్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. గుజరాత్తో హైదరాబాద్ ఢీకొట్టనుంది. -
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Saeed Anwar: మహిళలు ఉద్యోగాలు చేయడం వల్లే విడాకులు పెరుగుతున్నాయంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అన్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. -
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్. -
అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు.. ‘ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు’: సునీల్ ఛెత్రి
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి ముగింపు పలికాడు. ఈ మేరకు కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. -
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అంటేనే హాట్ కేక్. కానీ, భారత మాజీ క్రికెటర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదని వార్తలు రావడం గమనార్హం. -
నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. -
చెన్నై, బెంగళూరు మధ్యలో వరుణ్!
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్లేఆఫ్స్పై సన్రైజర్స్ గురి
బాదుడు మంత్రంతో.. దూకుడు ఆయుధంతో ఐపీఎల్-17వ సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. -
రాజస్థాన్ మళ్లీ..
ప్చ్.. రాజస్థాన్! ప్లేఆఫ్స్లో స్థానం ఖరారైనా.. కీలక సమరాలకు ముందు పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. -
నీరజ్దే పసిడి
మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. -
భారత్ను పాక్ ఓడించడం కష్టమే
టీ20 ప్రపంచకప్లో భారత్ను పాకిస్థాన్ ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. -
సాత్విక్ ద్వయం శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్- చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. -
లామిచానె జైలుశిక్ష రద్దు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెకు భారీ ఊరట. -
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM