కప్పు.. ఎవరి కొప్పులో?
నిరుడు టైటిల్కు అతి చేరువగా వెళ్లి.. ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ దిల్లీ క్యాపిటల్స్ ఓ వైపు! తొలిసారి తుదిపోరు చేరి.. ట్రోఫీని ముద్దాడాలని చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోవైపు! ఒకటేమో లీగ్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు.
నేడే డబ్ల్యూపీఎల్-2 ఫైనల్
దిల్లీతో బెంగళూరు పోరు
రాత్రి 7.30 నుంచి
నిరుడు టైటిల్కు అతి చేరువగా వెళ్లి.. ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ దిల్లీ క్యాపిటల్స్ ఓ వైపు! తొలిసారి తుదిపోరు చేరి.. ట్రోఫీని ముద్దాడాలని చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోవైపు! ఒకటేమో లీగ్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు.. మరొకటేమో ఒడుదొడుకులను దాటి నిలిచిన జట్టు. ఈ రెండు జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఫైనల్ నేడే. మరి విజేతగా నిలిచేదెవరు?
దిల్లీ: హోరాహోరీ పోరాటాలు.. రసవత్తర మ్యాచ్లు.. నాటకీయ మలుపులు.. ఇలా టీ20 క్రికెట్ మజాతో అభిమానులను అలరించిన డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో ఆఖరి అంకానికి వేళైంది. ఆదివారం ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. మరి ఐపీఎల్లో ఇప్పటివరకూ ఈ ఫ్రాంఛైజీల్లో ఏ పురుషుల జట్టూ విజేతగా నిలవలేదు. ఇప్పుడు అమ్మాయిల్లో ఏ జట్టు జయకేతనం ఎగరేస్తుందో చూడాలి. నిరుడు తుదిపోరులో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిన దిల్లీ ఈ సారి కప్పు వదలకూడదనే లక్ష్యంతో ఉంది. మెగ్ లానింగ్ సారథ్యంలో ఉత్తమ ప్రదర్శనతో సాగుతోంది. లీగ్ దశలో 8 మ్యాచ్ల్లో 6 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ చేరింది. కెప్టెన్ లానింగ్ (308 పరుగులు) బ్యాటింగ్లో రాణిస్తూ జట్టును విజయాల వైపు నడిపిస్తోంది. షెఫాలి వర్మ (265), జెమీమా రోడ్రిగ్్్స (235), అలీస్ క్యాప్సీ (230) కూడా బ్యాటింగ్లో కీలకం కానున్నారు. బౌలింగ్లో చూసుకుంటే పేస్ ఆల్రౌండర్ మరిజేన్ కాప్ (11), స్పిన్నర్లు జొనాసెన్ (11), రాధ యాదవ్ (10) నిలకడగా రాణిస్తున్నారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్న కాప్ పవర్ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బందుల్లోకి నెడుతోంది. మరోవైపు తడబాటును దాటి, బలంగా పుంజుకున్న ఆర్సీబీ లీగ్ దశలో 8 మ్యాచ్ల్లో నాలుగు చొప్పున విజయాలు, ఓటములతో మూడో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయికి షాకిచ్చిన ఈ జట్టు.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ జట్టులో ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ కీలకంగా మారింది. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అగ్రస్థానంలో ఉన్న ఆమె (312).. 7 వికెట్లూ పడగొట్టింది. మంధాన (269), రిచా ఘోష్ (240) కూడా బ్యాట్తో సత్తాచాటితే ఆర్సీబీకి తిరుగుండదు. బౌలింగ్లోనే ఆ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఆశ (10), సోఫీ మోలనూ (9)తో పాటు రేణుక, శ్రేయాంక, వేర్హామ్ కూడా రాణించాల్సి ఉంది. ఈ సారి లీగ్్ దశలో రెండు మ్యాచ్లతో సహా డబ్ల్యూపీఎల్లో ఇప్పటివరకూ ఆర్సీబీపై అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచిన దిల్లీ మరోసారి ఫేవరెట్గా కనిపిస్తోంది. పైగా సొంతగడ్డపై ఆడుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చేదే.
‘‘ఫైనల్కు ముందు మంచి లయతో ఉన్నాం. ఈ మ్యాచ్ గొప్పగా ఉండబోతోంది. ఎంతో ఉత్తేజితంగా ఉన్నాం. టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శనతో తుదిపోరులో గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ఆర్సీబీ కూడా అద్భుతంగా ఆడింది. ఒత్తిడిలోనూ రాణించింది. ఆ జట్టుతో మ్యాచ్ మాకు సవాలే. మేం అనుకున్నది చేస్తామనే నమ్మకంతో ఉన్నాం’’
మెగ్ లానింగ్
‘‘పురుషుల ఆర్సీబీ జట్టు కోణంలో చూస్తే కాస్త ఒత్తిడి తప్పదు. ఇది మాకు రెండో సీజనే. అందుకే ఎక్కువ ఒత్తిడికి లోను కాకూడదనే అనుకుంటున్నాం. పురుషుల జట్టుకు జరిగిన (ఇప్పటివరకూ ట్రోఫీ గెలవకపోవడం) దానితో మాకు సంబంధం లేదు. వర్తమానంలో జీవించాలని క్రికెట్ నేర్పింది. ఎవరైతే ఉత్తమ క్రికెట్ ఆడతారో వాళ్లే ఫైనల్లో గెలుస్తారు. నిరుడు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. ఈ సారి ప్రక్రియపై దృష్టి పెట్టి సాగుతున్నాం’’
స్మృతి మంధాన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద జోరు వాన..!
ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడానికి ఓవైపు హైదరాబాద్ జట్టు సిద్ధమవుతుంటే.. మరోవైపు వరుణుడు తన మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు. గుజరాత్తో నేడు జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్ను వరుణుడు పలకరించే అవకాశం ఉంది.
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. అయితే, పాండ్య ఎంపికపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
IPL PlayOffs: గుజరాత్తో జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? ప్లేఆఫ్స్ సమీకరణాలు ఎలా మారతాయి? -
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
ఈసారి ఐపీఎల్ సీజన్లో చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా ధోనీ కోసమే వస్తున్నారా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మైదానంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ధోనీ నామస్మరణతో మారు మోగిపోతోంది. -
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
ఉప్పల్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. గుజరాత్తో హైదరాబాద్ ఢీకొట్టనుంది. -
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Saeed Anwar: మహిళలు ఉద్యోగాలు చేయడం వల్లే విడాకులు పెరుగుతున్నాయంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అన్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. -
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్. -
అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు.. ‘ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు’: సునీల్ ఛెత్రి
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి ముగింపు పలికాడు. ఈ మేరకు కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. -
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అంటేనే హాట్ కేక్. కానీ, భారత మాజీ క్రికెటర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదని వార్తలు రావడం గమనార్హం. -
నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. -
చెన్నై, బెంగళూరు మధ్యలో వరుణ్!
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్లేఆఫ్స్పై సన్రైజర్స్ గురి
బాదుడు మంత్రంతో.. దూకుడు ఆయుధంతో ఐపీఎల్-17వ సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. -
రాజస్థాన్ మళ్లీ..
ప్చ్.. రాజస్థాన్! ప్లేఆఫ్స్లో స్థానం ఖరారైనా.. కీలక సమరాలకు ముందు పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. -
నీరజ్దే పసిడి
మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. -
భారత్ను పాక్ ఓడించడం కష్టమే
టీ20 ప్రపంచకప్లో భారత్ను పాకిస్థాన్ ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. -
సాత్విక్ ద్వయం శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్- చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. -
లామిచానె జైలుశిక్ష రద్దు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెకు భారీ ఊరట. -
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు