వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
దిల్లీ: విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని.. వేగంగా పరుగులు సాధించలేకపోతున్నాడన్న విమర్శలకు ఏబీ ఇలా స్పందించాడు. ‘‘కోహ్లి స్ట్రెక్రేట్ గురించి చాలారోజులుగా విమర్శలు విని విసిగిపోయా. విమర్శకులకు ఒక్కటే చెబుతున్నా.. క్రికెట్ అందించిన ఉత్తమ ఆటగాళ్లలో విరాట్ ఒకడు. ఐపీఎల్నూ అతడు గొప్పగా రాణించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అయినా ఇప్పటికీ అతడిని ట్రోలింగ్ చేసేవాళ్లకు క్రికెట్పై పరిజ్ఞానం లేదని అనిపిస్తోంది. ఇలా మాట్లాడుతున్నవాళ్లు ఎన్ని మ్యాచ్లు ఆడారు? ఐపీఎల్లో ఎన్ని సెంచరీలు సాధించారు? స్ట్రెక్రేట్, స్పిన్ బౌలింగ్లో సరిగా ఆడకపోవడం అనేవి నా దృష్టిలో పెద్ద విషయాలు కావు. జట్టు విజయానికి ఎంతగా ఉపయోపడుతున్నామో చూడాలి. గెలవడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు కాబట్టే విరాట్ 15 ఏళ్లుగా ఆర్సీబీకి ఆడుతున్నాడు’’ అని ఏబీ చెప్పాడు. కోహ్లి ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని..తన ఆటపై దృష్టి సారించాలని డివిలియర్స్ సలహా ఇచ్చాడు. ‘‘2016లో ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించాడు విరాట్. అప్పటికన్నా ప్రస్తుత సీజన్లోనే అతడి స్ట్రెక్రేట్ మెరుగ్గా ఉంది. మరి అతడిని విమర్శించాల్సిన అవసరం ఏంటి? కోహ్లి ఇంకా ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆటపై దృష్టి పెడితే చాలు’’ అని ఏబీ అన్నాడు. డుప్లెసిస్, జాక్స్ను ఓపెనింగ్లో దించి విరాట్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తే ఆర్సీబీకి మేలని.. అతడు తమ వెనుక ఉన్నాడన్న భరోసాతో ఓపెనర్లు వేగంగా పరుగులు చేసే అవకాశం ఉందన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
ఉప్పల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద జోరు వాన..!
ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడానికి ఓవైపు హైదరాబాద్ జట్టు సిద్ధమవుతుంటే.. మరోవైపు వరుణుడు తన మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు. గుజరాత్తో నేడు జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్ను వరుణుడు పలకరించే అవకాశం ఉంది.
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. అయితే, పాండ్య ఎంపికపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
IPL PlayOffs: గుజరాత్తో జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? ప్లేఆఫ్స్ సమీకరణాలు ఎలా మారతాయి? -
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
ఈసారి ఐపీఎల్ సీజన్లో చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా ధోనీ కోసమే వస్తున్నారా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మైదానంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ధోనీ నామస్మరణతో మారు మోగిపోతోంది. -
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
ఉప్పల్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. గుజరాత్తో హైదరాబాద్ ఢీకొట్టనుంది. -
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Saeed Anwar: మహిళలు ఉద్యోగాలు చేయడం వల్లే విడాకులు పెరుగుతున్నాయంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అన్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. -
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్. -
అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు.. ‘ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు’: సునీల్ ఛెత్రి
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి ముగింపు పలికాడు. ఈ మేరకు కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. -
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అంటేనే హాట్ కేక్. కానీ, భారత మాజీ క్రికెటర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదని వార్తలు రావడం గమనార్హం. -
నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. -
చెన్నై, బెంగళూరు మధ్యలో వరుణ్!
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్లేఆఫ్స్పై సన్రైజర్స్ గురి
బాదుడు మంత్రంతో.. దూకుడు ఆయుధంతో ఐపీఎల్-17వ సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. -
రాజస్థాన్ మళ్లీ..
ప్చ్.. రాజస్థాన్! ప్లేఆఫ్స్లో స్థానం ఖరారైనా.. కీలక సమరాలకు ముందు పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. -
నీరజ్దే పసిడి
మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. -
భారత్ను పాక్ ఓడించడం కష్టమే
టీ20 ప్రపంచకప్లో భారత్ను పాకిస్థాన్ ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. -
సాత్విక్ ద్వయం శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్- చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. -
లామిచానె జైలుశిక్ష రద్దు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెకు భారీ ఊరట. -
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
-
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ గెలుపు
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్